చాలా రోజుల తరువాత 'ఈ రోజుల్లో' హీరో!
ఈ రోజుల్లో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ అప్పట్లో ఆ సినిమాతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ లో మారుతీ దర్శకత్వం వహించిన ఆ సినిమా మంచి లాభాలను అందించడమే కాకుండా హీరో శ్రీ కి మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత శ్రీ ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు.
ఈ రోజుల్లో(2012) సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ అప్పట్లో ఆ సినిమాతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ లో మారుతి దర్శకత్వం వహించిన ఆ సినిమా మంచి లాభాలను అందించడమే కాకుండా హీరో శ్రీ కి మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత శ్రీ ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు.
ఇక చివరగా 2016లో త్రివిక్రమన్ సినిమాతో పలకరించిన శ్రీ ఆ తరువాత కనిపించలేదు. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మరో డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ కుర్ర హీరో. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్రధాన పాత్రల్లో కుమార్ జి. దర్శకత్వంలో తను.ఎస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’.
భరతనాట్యం నేపథ్యంలో లవ్ ,సస్పెన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. చండీఘర్కు చెందిన మోడల్ అవంతిక హరి నల్వా హీరోయిన్గా నటిస్తుండగా, గాయత్రి అయ్యర్ మరో ముఖ్య భూమికలో నటిస్తోంది.