రాధే శ్యామ్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. నేడు మూవీ నుండి ''ఈ రాతలే'' వీడియో సాంగ్ విడుదల చేశారు.
బ్యాక్ టూ బ్యాక్ మాస్ చిత్రాల తర్వాత ప్రభాస్(Prabhas) నుండి వస్తున్న రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న గ్రాండ్ గా విడుదల కానుంది. రాధే శ్యామ్ మూవీ నుండి నేడు ఈ రాతలే సాంగ్(EE Raathale Video song) వీడియో విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ఈ రాతలే సాంగ్, చాలా రొమాంటిక్ గా సాగింది. ప్రభాస్-పూజా మధ్య లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు రాధాకృష్ణ వీరిద్దరి లవ్ ట్రాక్ చాలా క్యూట్ అండ్ రొమాంటిక్ గా రాసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ సూపర్ రొమాంటిక్ గా ఉన్నారు. పూజా(Pooja Hegde) గ్లామర్ మరో ఎత్తు. మొత్తంగా ఈ రాతలే వీడియో సాంగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ మనసులు దోచేసింది.ఈ రాతలే సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, హరిణి పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు సాంగ్ లో కనిపిస్తుంది. లొకేషన్స్, సెట్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయి లాంటి సినిమా అవుతుందనిపిస్తుంది.
ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు. సకాలంలో సినిమా పూర్తి చేయరు, అప్డేట్స్ ఇవ్వరని యూవీ క్రియేషన్స్ ని సోషల్ మీడియాలో రాయలేని భాషలో ఫ్యాన్స్ తిడుతూ ఉంటారు. వాళ్ళు తిడతారు మేము పడతాం అన్నతీరుగా యూవీ క్రియేషన్స్ వ్యవహరిస్తోంది. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ఇది అతిపెద్ద కంప్లైంట్ గా ఉంది. అయినా యూవీ క్రియేషన్స్ తీరు మారడం లేదు.
రాధే శ్యామ్ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా అప్డేట్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ నిర్వహించాలని ఫ్యాన్స్ నుండి డిమాండ్ అధికమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ అసహనం ఫీక్స్ కి చేరింది. ఈ క్రమంలో నేడు వీడియో సాంగ్ విడుదల చేశారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతనో ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ మూవీ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
