`ఏజెంట్‌` డిజాస్టర్‌ ప్రభావం దర్శకుడు సురేందర్‌రెడ్డిపై పడింది. ఆయనకు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు. సురేందర్‌రెడ్డికి. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. కానీ... 

సురేందర్‌రెడ్డి `ఏజెంట్‌` సినిమాతో ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఈ సినిమా నష్టం అంతా ఇంతా కాదు. గతేడాది కొరటాల శివకి `ఆచార్య` ఎలాంటిదో, ఇప్పుడు సురేందర్‌రెడ్డికి `ఏజెంట్‌` అలాంటి డిజాస్టరనే చెప్పాలి. అఖిల్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన పరాజయం చెందింది. సుమారు 60-70కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకి కనీసం పది కోట్ల నెట్‌ కూడా రాలేదు. యాభైకోట్లకుపైగా నష్టాలు చవిచూసిందీ మూవీ. కొన్న బయ్యర్లు, నిర్మాత భారీగా నష్టపోయారు. ఓటీటీ, డిజిటల్‌ కొంత ఆదుకున్నాయి. కానీ నష్టం మాత్రం గట్టిదే. 

`ఏజెంట్‌` డిజాస్టర్‌ ప్రభావం దర్శకుడు సురేందర్‌రెడ్డిపై పడింది. ఆయనకు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు. సురేందర్‌రెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. ఎస్‌ఆర్‌టీ బ్యానర్‌పి రామ్‌ తాళ్లూరి కాంబినేషన్‌లో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రస్తుతం ఈ సినిమా చేసే అవకాశం లేదు. ఆయన కమిట్‌మెంట్స్ వేరే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు చేసేసి పాలిటిక్స్ లో బిజీ కాబోతున్నారు. 

ఈ నేపథ్యంలో సురేందర్‌ రెడ్డి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారట. తాజాగా మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. పవన్‌ సినిమా కథతోనే వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా చేయబోతున్నారట సురేందర్‌రెడ్డి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. సురేందర్‌రెడ్డికి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. అల్లు అర్జున్‌తో ఆ సినిమా అనుకున్నారు. కానీ బన్నీకి ఇప్పుడున్న పరిస్థితులో కుదరదు. దీంతో వైష్ణవ్‌తేజ్‌తో, గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకి సురేందర్‌రెడ్డినే దర్శకత్వం వహిస్తారా. వేరే దర్శకుడితో చేయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

`ఉప్పెన` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు వైష్ణవ్‌ తేజ్‌. కానీ ఆ తర్వాత సినిమాలు మాత్రం ఆడలేదు. `కొంగపొలం`, `రంగరంగ వైభవంగా` చిత్రాలు దారుణంగా పరాజయం చెందాయి. ఇప్పుడు `ఆదికేశవ్‌` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీలా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది.