అది నా సొంత కథ.. ఎనిమిదేళ్ల తరువాత స్పందించిన స్టార్ డైరెక్టర్!
ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 'యందిరన్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 2010 లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 'రోబో' పేరుతో విడుదలయ్యి రికార్డులు కొల్లగొట్టింది. రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా దర్శకుడిగా శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది.
ఆయన సినిమాలో చూపించిన టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా 'రోబో 2.0' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ అది కాస్త నవంబర్ కి వాయిదా పడింది.