Asianet News TeluguAsianet News Telugu

అది నా సొంత కథ.. ఎనిమిదేళ్ల తరువాత స్పందించిన స్టార్ డైరెక్టర్!

ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది

director shankar about enthiran story

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 'యందిరన్‌' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 2010 లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 'రోబో' పేరుతో విడుదలయ్యి రికార్డులు కొల్లగొట్టింది. రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా దర్శకుడిగా శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

ఆయన సినిమాలో చూపించిన టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా 'రోబో 2.0' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ అది కాస్త నవంబర్ కి వాయిదా పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios