ఫిదా సినిమాను మామూలు సినిమాగా తీసుకున్న దిల్ రాజు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదాతో అంచనాలు తలక్రిందులు నమ్మకం లేని ఫిదా రిజల్ట్ చూసి మైండ్ బ్లాంక్ అయిందన్న దిల్ రాజు
దిల్ రాజు నిర్మాత అంటేనే ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో వుంటాయి. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఫిదా. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అయితే కథ చెప్పినప్పుడు కాస్త పర్వాలేదు అనుకున్న దిల్ రాజు సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం సెట్స్ దగ్గరకు వెళ్లలేదట. అంతేకాదు సినిమా మొత్తం పూర్తయ్యాక సినిమా మీద నమ్మకం కుదరక.. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిం కూడా చేయమని చెప్పాడట.
అందుకోసమే దిల్ రాజు సినిమా అయినా సరే ఫిదాకు మాములు ప్రమోషన్స్ తోనే థియేటర్లలోకి వచ్చింది. ఇక మొదటి షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో దిల్ రాజు మైండ్ బ్లాంక్ అయ్యిందట. శేఖర్ కమ్ముల మీద ఉంచిన నమ్మకం నిజమైందని అతన్ని తక్కువ అంచనా వేశామని అనుకున్నాడట దిల్ రాజు.
నిర్మాతగా మంచి అభిరుచి గల సినిమాలను తీసే దిల్ రాజు తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల మీద ఓ మంచి అవగాహనతో ఉంటాడు. కాని ఫిదా మూవీ దిల్ రాజు అంచనాలను తలకిందలు చేసిందట. సినిమాకు వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి తను చాలా తప్పు చేశానని రియలైజ్ అయాడట దిల్ రాజు.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చినా హీరోయిన్ సాయి పల్లవి సినిమాను నిలబెట్టేసింది. శేఖర్ కమ్ముల ఆమె పాత్ర ద్వారానే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. అనామిక తర్వాత శేఖర్ కమ్ముల ఫిదా నిజంగానే ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఫిదానే అవుతుంది.
