'ఎఫ్ 3' సెలూన్ ప్రారంభించిన దిల్ రాజు.. అతిథులుగా అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని
సినిమా పరిశ్రమకు అత్యంత ఫేవరెట్ అయిన ఎఫ్3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ సమీపంలో ఆదివారం ప్రారంభమైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని సమక్షంలో ఎఫ్ 3 సెలూన్ ప్రారంభమైంది.
సినిమా పరిశ్రమకు అత్యంత ఫేవరెట్ అయిన ఎఫ్3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ సమీపంలో ఆదివారం ప్రారంభమైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని సమక్షంలో ఎఫ్ 3 సెలూన్ ప్రారంభమైంది. ఈ కొత్త బ్రాంచి 2వేల చదరపు అడుగుల విశాల ప్రదేశంలో, అత్యంత అధునాతన పరికరాలతో కస్టమర్లు ముందెన్నడూ చవిచూడని సరికొత్తఅనుభూతినిచ్చే విధంగా రూపొందించారు.
గత కొన్నేళ్లుగా ఎఫ్3 సురేష్గా ప్రాచుర్యం పొందిన సురేష్ నడిపిస్తున్న ఎఫ్3 సెలూన్లు సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అందరికీ హాట్ ఫేవరెట్గా నిలుస్తున్నాయి. అత్యంత అధునాతన హెయిర్ స్టైళలు, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు పూర్తిస్థాయి సంతృప్తిని ఎఫ్3 సెలూన్లు అందిస్తున్నాయి.
మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్లో శిక్షణ పొందాను, ఎఫ్3 సెలూన్లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారే అని ఎఫ్ 3 వ్యవస్థాపకుడు సురేష్ అన్నారు.
ఇదిలా ఉండగా దిల్ రాజు నిర్మాణంలో.. అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎఫ్ 3 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్.
Also Read:కొంటె చూపులతో రష్మీ కవ్వింత.. చీరకట్టులో హొయలు, చూపు తిప్పుకోగలమా