ధనుష్‌ హీరోగా నటించిన `సార్‌` మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. ప్రీమియర్స్ షోలకు స్పందన బాగుంది. ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయట. మరోవైపు ఓటీటీ డిటెయిల్స్ బయటకు వచ్చాయి. 

ధనుష్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన `సార్‌` మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 17) విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తుంది. చిత్ర బృందం కూడా తాజాగా వెల్లడించింది. తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఏడాది తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌజ్‌ఫుల్‌ అనే ఫోన్‌ కాల్స్ వస్తున్నాయని చెప్పారు నిర్మాత నాగవంశీ. ప్రిమియర్స్ కి పాజిటివ్‌ టాక్‌ రావడంతో మార్నింగ్‌ షోలన్నీ ఫుల్‌ అయ్యాయని చెప్పారు. షోకి షోకి వసూళ్లు పెరుగుతున్నాయని చెప్పారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డిటెయిల్స్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ని నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరోవైపు డిజిటల్‌ రైట్స్ ని జెమినీ సొంతం చేసుకోవడం విశేషం. అయితే భారీ మొత్తానికి ఓటీటీ, డిజిటల్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. మార్చి చివరి వారంలోగానీ, ఏప్రిల్‌ మొదటి వారంలోగానీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. 

మరోవైపు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. `భీమ్లా నాయక్‌`, `డీజేటిల్లు`లతో పోల్చారు. ఆయన చెబుతూ, `గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన `భీమ్లా నాయక్`, `డీజే టిల్లు` సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు `సార్` సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకట్రెండు ప్రీమియర్ లు అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తో షోలు పెంచుకుంటూ పోయాము. ఒక్క హైదరాబాద్ లోనే 25 ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం 40 షోలు వేశాము. ధనుష్ గారి 'రఘువరన్ బి.టెక్' తెలుగులో టోటల్ రన్ మీద ఎంత వసూలు చేసిందో ఆ మొత్తం ఒక్కరోజులోనే సార్ కి వస్తాయి. తమిళ్ లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్ గా ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమ నుంచి కొందరు ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడారు. దిల్‌ రాజు ఫోన్ చేసి ఈ సినిమాకి డబ్బులు, పేరు రెండూ వస్తాయి అన్నారు. మళ్ళీ ఇంకోసారి నువ్వు నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే సినిమా వచ్చింది.. ఇలాంటి మంచి సినిమా తీయి అని ఆయన ఫోన్ చేసి చెప్పారు` అని అన్నారు. ఈసినిమా కథకి తన అనుభవాలను చెబుతూ, `నేనొక పెద్ద కాలేజ్ లో ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ ర్యాంక్ రాలేదు. డొనేషన్ అడిగితే ఎక్కువ చెప్పారు. మా అమ్మ పొలం అమ్మి నన్ను చదివించింది. అయినా కూడా నేను అనుకున్న కాలేజ్ లో చదువుకోలేకయాను. ప్రస్తుతం ఎల్కేజీలకు ఫీజులు దారుణంగా ఉన్నాయి. ఫీజులు తగ్గిస్తే చదువు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలని అనుకున్నాం` అని అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటూ, 2018 లో వచ్చిన నా మొదటి సినిమా `తొలిప్రేమ` తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంతమంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇక్కడ 40 షోలకు వచ్చిన స్పందనతో తమిళ్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 

ఇంకా మాట్లాడుతూ, మొదటి సినిమా విజయం సాధించినప్పుడు మనకు అదే సరైన రూట్ అనిపించి అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నేను అదే చేశాను. `మిస్టర్ మజ్ను` విషయంలో కొంత అతి విశ్వాసం దెబ్బ తీసింది. `రంగ్ దే` ప్రయత్న లోపం అని చెప్పలేను కానీ.. వరుసగా మూడో లవ్ స్టోరీ కావడం, పరిస్థితుల ప్రభావం వల్ల దానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. దాంతో నా దారిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వరుసగా మూడు ప్రేమ కథల తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులను నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేయడం జరిగింది. కేవలం సందేశం మాత్రమే ఇవ్వాలనుకోలేదు. వినోదం కూడా పంచాలనుకున్నాను. సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను. ఈ చిత్రం చాలాకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది` అని చెప్పారు వెంకీ అట్లూరి.

ధనుష్‌ రియాక్షన్‌పై దర్శకుడు చెబుతూ, ధనుష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రే ఫోన్ చేసి ప్రీమియర్ల స్పందన ఏంటని అడిగారు. బాగుంది సార్ అంటే రేపు ఉదయం వరకు ఆగు అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకు అన్నారో అర్థంకాలేదు. చెన్నైలో నేను ప్రేక్షకుల మధ్యలో షో చూశాక.. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అడిగారు. చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే.. అందుకే నిన్ను ఆగమన్నారు అన్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల ధనుష్ గారితో పాటు టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు` అని చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. 

Scroll to load tweet…