తెలుగులో ధనుష్ మూడో సినిమా..డైరక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రస్తుతం ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’ షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మధ్యకాలంలో తమిళ హీరోలు చాలా మంది తెలుగులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు మార్కెట్ ని గ్రాబ్ చేయటం ఓ కారణం అయితే..తెలుగు నిర్మాతలు ఇచ్చే పేమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి తమిళ హీరోలు దృష్టి ఇక్కడ పడింది. మన హీరోలేమో తమిళ డైరక్టర్లతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’ షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీని తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇప్పుడు మూడో ప్రాజెక్ట్ పై ధనుష్ సంతకం చేసినట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో ధనుష్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ అనే సినిమా తీసిన కిషోర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పైప్లైన్లో ఉంది. అన్నీ కుదిరితే.. ధనుష్ నటించే మూడో తెలుగు సినిమా ఇదే అవుతుంది.
మరో ప్రక్క దిల్ రాజు కూడా తమిళ హీరోలు, దర్శకుల అంటే ఉత్సాహం చూపిస్తున్నారు. విజయ్ తో ‘వారసుడు’ అనే భారీ బడ్జెట్ సినిమా చేసి సంక్రాంతికి వస్తున్నారు దిల్ రాజు..ఆ తర్వాత తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ధనుష్ తో మాట్లాడి కథ చెప్పి ఒప్పించారు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కి మంచి గుర్తింపు ఉంది కాబట్టి తెలుగు మార్కెట్ పెంచుకునేందుకు తమిళ స్టార్స్ కూడా దిల్ రాజు ఆఫర్ ని ఓకే చెప్పేస్తున్నారు. మొత్తానికి తమిళ తెలుగు కాంబినేషన్స్ తో త్వరలో వరస సినిమాలు రాబోతున్నాయని దిల్ రాజు ఈ సినిమాతో హింట్ ఇస్తున్నారు.