ధనుష్ ‘నేనే వస్తున్నా’ నుంచి అదిరిపోయే సాంగ్.. మెదడుకు పదును పెడుతున్న లిరిక్స్.!
తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేనే వస్తున్నా’(Nene Vasthunna). ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్ రిలీజ్ అయ్యింది. లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
గ్యాప్ లేకుండా వరుస పెట్టి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు తమిళ స్టార్ హీరో ధనుష్. ఏమాత్రం ఆలస్యం లేకుండా మూడు నెలల గ్యాప్ లో చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్, ఆ చిత్రాల్లో పాటలు కూడా రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. తాజాగా తమిళంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నానే వరువేన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగులో‘నేనే వస్తున్నా’ టైటిల్ తో వస్తోంది. రీసెంట్ చిత్ర విడుదల తేదీని అనౌన్స్ చేయగా.. తాజాగా ఫస్ట్ సింగ్ ను విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్రం నుండి ‘ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’ (Oke Oka Oorilona) పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ‘పాముల్లోనా విషముంది, పువ్వులోనా విషముంది.. పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే.. మనిషిలో మృగమే దాగుంది.. మృగములో మానవత ఉంటుంది’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలు ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.