దేవిశ్రీ ప్రసాద్ కు అరుదైన గౌరవం, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పై రాక్ స్టార్ స్టైలీష్ పిక్
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అరుదైన గౌరవం సాధించారు. ఇంటర్నేషనల్ లెవల్లో ఆయన పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. చాలా అరుదైన ఘనత సాధించాడు దేవిశ్రీ.
టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్ తో టాలీవుడ్ లో రాక్ స్టార్ బిరుదు సాధించాడు దేవిశ్రీ ప్రసాద్. మాస్.. క్లాస్ ఆడియన్స్ ని అలరిస్తూ.. దూసుకుపోతున్నాడు దేవిశ్రీ. ఈమద్య తమన్, అనురుధ్ లు రావడంతో.. దేవిశ్రీ ప్రసాద్ ప్రభావం కాస్త తగ్గింది. కాని దేవిశ్రీ రికార్డ్స్ మాత్రం ఏ డోఖాలేదు. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన దేవిశ్రీ.. సింగర్ గా, లిరిక్ రైటర్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.
సౌత్ లో.. మలయాళం తప్పించి అన్ని భాషల్లో దూసుకుపోతున్న దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం పుష్ప2తో రికార్డ్స్ బ్రేక్ చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ చేసిన ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ గా మెగాస్టార్ వాల్తేరు వీరయ్యకు సంగీతం అందించి.. హిట్ కొట్టాడు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు మ్యూజిక్ చేశాడు. ఇక పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.
ఊ అంటావా మావ ఊహూ అంటావా అంటూ.. పాన్ ఇండియాను ఊపు ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్.. తాజాగా అరుదైన రికార్డ్ సాధించాడు. అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ రోలింగ్ స్టోన్ కవర్ పేజీ పై దేవిశ్రీ ప్రసాద్ స్తానం దక్కించుకున్నాడు.ఈ విషయాన్ని తెలియజేస్తూ రోలింగ్ స్టోన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
తన మ్యూజిక్ స్టైల్ తో, చార్ట్ బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్.. ఈ నెల మా మ్యాగజైన్ పేజీని కవర్ చేశారు అంటూ కవర్ పేజీ ని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా దేవిశ్రీ ప్రస్తుతం పుష్ప 2 తో సూర్య కంగువ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ RC16 సినిమాలకు పని చేస్తున్నాడు.