Asianet News TeluguAsianet News Telugu

చివరికి అనుష్క కూడా ప్రభాస్‌లా తయారయ్యిందే..!

స్టార్ హీరోయిన్ అనుష్క, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీరుతో ఫ్యాన్స్ విసిగిపోతున్నారు. బాహుబలి 2 తరువాత వీరిద్దరూ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఆ ఒప్పుకున్న సినిమాలు ఏళ్ల తరబడి తెరకెక్కడంతో పాటు విడులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా అనుష్క ఇంత వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు.  

Delay of Prabhas and Anushka's movies hurts their fans a lot
Author
Hyderabad, First Published Aug 11, 2020, 4:56 PM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వివాదరహితురాలిగా పేరున్న అనుష్క పరిశ్రమలో అందరికీ హాట్ ఫేవరేట్ హీరోయిన్. అరుంధతి చిత్రంలో అధ్బుత నటనతో తెలుగు ప్రేక్షకుకుల గుండెల్లో నిలిచిపోయిన ఆమె, బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకుంది. ఐతే బాహుబలి 2 తరువాత సినిమాలు చేయడం తగ్గించింది. డేట్స్ ఇస్తే కోట్లు కుమ్మరించే నిర్మాతలు ఉన్నప్పటికీ ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. 2017లో బాహుబలి 2 విడుదలైన తరువాత ఆమె చేసింది ఒకే ఒక చిత్రం. 2018లో విడుదలైన భాగమతి ఆమె చివరి చిత్రం. ఆ మూవీ తరువాత భారీ గ్యాప్ తీసుకున్న ఆమె ప్రయోగాత్మక చిత్రం నిశ్శబ్దం మూవీలో నటించారు. అమెరికా నేపథ్యంలో నడిచే హారర్ డ్రామాగా నిశ్శబ్దం మూవీ తెరకెక్కగా, అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ రోల్ చేశారు.

చాలా కాలం తరువాత ఆ మూవీ విడుదల అవుతుందనుకుంటే, లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా, సాధారణ పరిస్థితుల కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సైరా మూవీలో జస్ట్ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ కి కొంచెం ఊరట పంచారు. అనుష్క నుండి వరుసగా చిత్రాలు రాకపోవడం ఫ్యాన్స్ ని బాగా నిరాశపెడుతుందట. ఇంకెన్నాళ్లు నిశ్శబ్దం మూవీని బాక్సులలో దాస్తారు, కనీశం ఓ టి టి లో విడుదల చేయమని కోరుతున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ తో ఓ టి టి సంస్థలు వస్తున్నా, నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. 

మరోవైపు  నిశ్శబ్దం మూవీ తరువాత అనుష్క మరో ప్రాజెక్ట్ ఓ కే చేయలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ కి జంటగా నటించనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన లేదు. దీనితో బాహుబలి తరువాత అనుష్క కూడా రెబెల్ స్టార్ ప్రభాస్ వలె తయారైందని ఫ్యాన్స్  చెప్పుకుంటున్నారు. బాహుబలి 2 విడుదలై ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. ఈ మూడేళ్ళలో ప్రభాస్ చేసింది కేవలం ఒక సినిమా మాత్రమే. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన రాధే శ్యామ్ మూవీని ఇంకా తెరకెక్కిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ దెబ్బతో ఆ మూవీ విడుదల సైతం 2021కి షిఫ్ట్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios