Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ కు డేట్, టైమ్ ఫిక్స్.. లవ్లీ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్!

నందమూరి బాలకృష్ణ - శృతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా  చిత్రం ‘వీరసింహారెడ్డి’. రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా సెంకడ్ సింగిల్ విడుదలకు డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.

Date and time fix for Balakrishnas Veerasimha Reddy second single, Beautiful poster released!
Author
First Published Dec 13, 2022, 7:37 PM IST

గాడ్ ఆఫ్ మాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 
మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. మూవీలో బాలయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ప్రమోషన్ మెటీరియల్ కూడా అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ పై అప్డేట్ అందించారు. ‘సుగుణ సుందరి’ టైటిల్ తో రెండో పాటను డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. లేటెస్ట్ గా సాంగ్  రిలీజ్ కు టైమ్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 15న ఉదయం 9:42 గంటలకు విడుదల కానుందని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక లవ్లీ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇక శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో మతిపోగొట్టింది. ఈ యుగళగీతంలో లీడ్ పెయిర్ అద్భుతమైన నృత్యాలు కనిపిస్తాయి. ఎస్ థమన్ ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందిస్తున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా  వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios