జానీ మాస్టర్ అంత మోసం చేశాడా? పవన్ కళ్యాణ్ కి సతీష్ ఫిర్యాదు!
డాన్సర్ సతీష్ తన గురువు జానీ మాస్టర్ పై ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో జానీ మాస్టర్ వివరణ ఇచ్చాడు.
జానీ మాస్టర్ మీద డాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశాడు. సతీష్ మాట్లాడుతూ... నేను TFTDDA అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ. 5 కోట్లతో ఓ స్థానం కొనుగోలు చేశాము.అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని, అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఎన్నుకొన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికై 6 నెలలు అవుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఆ ప్రయత్నాలకు కొంత బ్రేక్ పడింది అని జానీ వివరణ ఇచ్చారు.
అప్పుడే రంజాన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను ఎలాంటి పాటలు వినను .పాటలు కంపోజ్ కూడా చేయను. నెల రోజు ఉపవాసం చేస్తాను. హెల్త్ ఇన్యూరెన్ గురిని రామ్ చరణ్, ఉపాసనలతో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం. పనులు, కార్యాచరణ సవ్యంగా సాగుతున్నది అని జానీ మాస్టర్ తన సంస్థ కార్యకలాపాలను, తన ప్రయత్నాలను మీడియాకు తెలిపారు. .
రూల్స్ కమిటీ ప్రకారం.. కొరియోగ్రాఫర్ తో చర్చలు జరిపిన తర్వాత అతనికి లక్ష రూపాయల జరిమానా విధించారు. మా అసోసియేషన్లోకి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా.. డబ్బులు ఇచ్చి అనుకున్నాను.ఒకరి పొట్టకొట్టడం నాకు తెలియదు. అతడు చేసిన ఆరోపణలకు పశ్చాత్తాపం చెంది క్షమాపణ కొరితే జరిమానా లేకుండా వదిలివేసే వాళ్లం. అలా కాకుండా నేనేంటో చూపిస్తానని బెదిరించారు అని వివాదం వెను విషయాలను జానీ మాస్టర్ వివరించారు.