Asianet News TeluguAsianet News Telugu

‘కార్తికేయ 3’పై క్రేజీ అప్డేట్.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్.!

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). నిఖిల్ నటించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో సీక్వెల్ ను కూడా మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

Crazy update on Karthikeya 3 Movie, Makers preparations for planning grandly!
Author
First Published Sep 23, 2022, 3:58 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) - అనుపమా పరమేశ్వరన్  జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్వకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో మేకర్స్ ‘కార్తికేయ’ ఫ్రాంచైజీని విస్తరించాలని చూస్తున్నారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్టుకు అన్యూహ స్పందన లభించడంతో ‘కార్తికేయ 3’ (Karthikeya 3)ని కూడా గ్రాండ్ గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు కూడా నెక్ట్స్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తుండటం విశేషం.

ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి ‘కార్తికేయ 3’ ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ‘కార్తికేయ 3’పైనా క్రేజీ అప్డేట్ అందింది. ఇప్పటికే మేకర్స్ సీక్వెల్ ప్రిపరేషన్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. ‘కార్తికేయ 2’కు తెలుగు  స్టేట్స్ తో పాటు హిందీలోనూననవ ప్రేక్షకులు బ్రహ్మండంగా ఆదరించారు. అటు యూఎస్ ఏలోనూ  ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్ సీక్వెల్ ను మరింత గ్రాండ్ తెరకెక్కించాలని భావిస్తున్నారంట. అంతేకాకుండా ఈసారి 3డీలోనూ విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలనే ఈ చిత్రం ఓటీటీలోకి రాకా అక్కడ మంచి రెస్పాన్స్ నే సొంతం  చేసుకుంది. ఈ రోజు మలయాళ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. 
 
‘కార్తికేయ 2’ రిలీజ్ డే నుంచి థియేట్రికల్ రన్ కొనసాగిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తక్కువ థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం క్రమక్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయింది.  దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు సాధించింది. ఇక ఈసారి ఈ టార్గెట్ ను క్రాస్ చేయాలని భావిస్తున్నారు. పార్ట్ 2లో నిఖిల్ సిద్ధార్థ - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటించారు. పార్ట్ 3లోనూ ఈ బ్యూటీ కొనసాగే అవకాశం ఉంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్వహించారు. కాల భైరవ సంగీతం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios