కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ (Prashanth neel)మూవీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది .  


ఎన్టీఆర్ (NTR)తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించిన చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం సలార్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్, అనంతరం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ని ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రశాంత్‌ నీల్‌ కేజీయఫ్‌ 2(KGF 2), సలార్‌ మూవీ షూటింగ్‌లతో బిజీ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఒక లైన్ స్క్రిప్ట్‌ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును దసరా పండగ నాడు లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగు కూడా మొదలవుతుందనిసమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సెక్సెస్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న ఎన్టీఆర్‌, నెక్ట్‌ మూవీ కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. '

కాగా మే 5న ప్రశాంత్‌ నీల్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు వారి వివాహ వార్షికోత్సవాలను ఇరు కుటుంబాలతో కలిసి ఒక్కచోటే సెలబ్రెట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌-లిఖిత, ఎన్టీఆర్‌-ప్రణతిల వివాహ వార్షికోత్సవం ఒకేరోజు కావడం విశేషం.