ప్రభాస్ మూవీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్!
ఆదిపురుష్, సలార్ చిత్రాలకు ముందే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీ ప్రకటించారు. ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తాం అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం.
దేశంలోనే మరో స్టార్ చేయలేని భారీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఆయన ప్రకటించిన ప్రతి సినిమా బడ్జెట్ రూ. 400కోట్లకు పై మాటే. పాన్ ఇండియా స్టార్ గా వందల కోట్ల వసూళ్లు రాబట్ట గల హీరోగా ఆయనతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఏక కాలంలో ప్రభాస్ మూడు చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. రాధే శ్యామ్ షూటింగ్ చాలా కాలంగా జరుగుతుండగా, దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాయి.
ఈ మూడు చిత్రాల అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లో పాల్గొననున్నాడు. ఆదిపురుష్, సలార్ చిత్రాలకు ముందే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీ ప్రకటించారు. ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తాం అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. సినిమా స్కేల్ కి తగ్గట్టుగా అదే స్థాయిలో ఆర్టిస్ట్స్ ని ఎంపిక చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెను ఈ చిత్రం కోసం తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంతో దీపికా టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. కాగా ఈ మూవీ కోసం ఏకంగా పది మంది బాలీవుడ్ నటులను తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ గా నిలిచిన సీరియల్ నటుడు సిద్దార్థ్ శుక్లాను ఓ కీలక రోల్ కోసం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.