బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్‌ షో అనైతికమని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారం చేసేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షో వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. ఇలాంటి షోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ఈ అనైతిక షోను వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని నారాయణ ఆరోపించారు. బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్‌ షో అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్ రివీల్డ్

దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని సీపీఐ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారం చేసేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గత ఆదివారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.