Asianet News TeluguAsianet News Telugu

Trisha : ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కోవిడ్ పాజిటివ్.

ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు కరోనా.. వరుసగా స్టార్స్ అంతా కరోనా బారిన పడుతున్నారు. ఇక ఈసారి హీరోయిన్ త్రిషవంతు వచ్చింది. తాను కూడా కోవిడ్ బారిన పడ్డట్టు అనౌన్స్ చేసింది.

Covid Positive For Heroin Trisha
Author
Hyderabad, First Published Jan 8, 2022, 8:57 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా. పేదా,ధనికా అన్న తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఒకరి తరువాత మరొకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రీసెంట్ గా చూసుకుంటేనే.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్, లక్ష్మీ, సీనియర్ హీరోయిన్ మీనా ఫ్యామిలీ..సత్యరాజ్.. ఇలా వరుసగా అందరూ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కరోనా బాధితుల్లో హీరోయిన్ త్రిష(Trisha) కూడా చేరింది.

తనకు కరోనా పాజిటీవ్ వచ్చిందటూ త్రిష(Trisha) ట్విట్టర్ లో వెల్లడించారు. అది కూడా ఏడాది ప్రారంభంలోనే కోవిడ్ బారిన పడినట్టు వెల్లడించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న త్రిష ట్వీట్ చేస్తూ..  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అన్ని నియమాలు పాటిస్తున్నా.. నేను కోవడి బారిన పడ్డాను. కోవిడ్ ఉన్నవారిలో ఉండే లక్షణాలు అన్నీ నేను ఫేస్ చేశాను. కొత్త ఏడాదికి కొంచెం ముందు కరోనా నన్ను తాకింది. కాని ఆ రోజులు నన్ను ఎంతగానో బాధించాయి.. ప్రస్తుతం నేను కోలకుంటున్నాను అన్నారు త్రిష(Trisha).

 

అంతే కాదు. తాను రెండు డోసుల వాక్సిన్ వేసుకున్నానని.. దాని వల్లే కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నానంటోంది. అందుకే అందరూ నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ తప్పని సరిగా ధరించాలని, కోవిడ్ నియయాలు మర్చిపోకుండ పాటించాలని కోరింది త్రిష(Trisha). ఈరోజు నేను బాగున్నాను.. త్వరలో మళ్ళీ టెస్ట్ చేయించుకుని ఇంటికి తిరిగి వస్తాను.. నా కోసం ప్రార్థించిన నా ఫ్యామిలీ.. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింద త్రిష. ఈ విషయం తెలిసిన త్రిష అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.

Also Read :Sathyaraj: సత్యరాజ్ కు కోవిడ్, హటాత్తుగా సీరియస్..హాస్పిటల్ కు తరలింపు

ఇక రీసెంట్ మన్త్స్ లో చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారన పడుతున్నారు. చాలా మంది కోలుకున్నారు కూడా. లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hasan), విక్రమ్,వడివేలు వంటివారు లాస్ట్ ఇయర్ కరోనాతో ఇబ్బంద పడితే.. కొత్త ఏడాది స్టార్ట్ అవ్వడంతోనే సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu).. తమన్ లాంటి స్టార్స్ కు కోవిడ్ సోకింది. థార్డ్ వేవ్ విజృంబిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios