ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్.. ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?
మెట్రో రైల్లో ఓ జంటను తోటి ప్రయాణికులు చితకబాదారు. ఓ స్టేషన్లో వారిని కిందకు లాగేసి యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ప్రయాణికుల ఆగ్రహానికి కారణం.. మెట్రో రైలు బోగీలో వారు పబ్లిగ్గా కౌగిలించుకోవడమే. కోల్కతా మెట్రో రైల్లో సోమవారం (ఏప్రిల్ 30) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మెట్రో రైల్లో ఆ జంట శృతి మించి ప్రవర్తించింది. దీంతో పక్కనే ఉన్నవాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయిన సీనియర్ సిటిజన్లు, మధ్య వయసువారు ఆ జంటపై దాడి చేశారు. మెట్రో స్టేషన్ రాగానే ఆ ఇద్దరినీ కిందికి దింపి మరీ దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులు కురిపిస్తుంటే పక్కనే యువతి బాధితుణ్ని బిగ్గరగా పట్టుకొని రక్షించే ప్రయత్నం చేసింది.ఈ ఉదంతంపై చారిత్రక కోల్కతా నగరం రెండు వర్గాలుగా విడిపోయింది. కొంత మంది ఈ యువ జంట చర్యను తప్పుబడుతుండగా.. మరికొంత మంది ఆటవిక ఆలోచనల నుంచి బయటపడాలని వృద్ధులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated May 3, 2018, 10:55 AM IST