Asianet News TeluguAsianet News Telugu

ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్.. ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?

ట్రైన్ లోనే ఘాటు రోమాన్స్..  ప్రయాణికులు ఏం చేశారో తెలుసా.?

couple beaten in metro train for hugging in public at calcutta

మెట్రో రైల్లో ఓ జంటను తోటి ప్రయాణికులు చితకబాదారు. ఓ స్టేషన్లో వారిని కిందకు లాగేసి యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ప్రయాణికుల ఆగ్రహానికి కారణం.. మెట్రో రైలు బోగీలో వారు పబ్లిగ్గా కౌగిలించుకోవడమే. కోల్‌కతా మెట్రో రైల్లో సోమవారం (ఏప్రిల్ 30) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మెట్రో రైల్లో ఆ జంట శృతి మించి ప్రవర్తించింది. దీంతో పక్కనే ఉన్నవాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయిన సీనియర్ సిటిజన్లు, మధ్య వయసువారు ఆ జంటపై దాడి చేశారు.  మెట్రో స్టేషన్ రాగానే ఆ ఇద్దరినీ కిందికి దింపి మరీ దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులు కురిపిస్తుంటే పక్కనే యువతి బాధితుణ్ని బిగ్గరగా పట్టుకొని రక్షించే ప్రయత్నం చేసింది.ఈ ఉదంతంపై చారిత్రక కోల్‌కతా నగరం రెండు వర్గాలుగా విడిపోయింది. కొంత మంది ఈ యువ జంట చర్యను తప్పుబడుతుండగా.. మరికొంత మంది ఆటవిక ఆలోచనల నుంచి బయటపడాలని వృద్ధులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios