నిర్మాతకి కరోనా.. షాక్లో `ఆర్ ఆర్ ఆర్` టీమ్..
`ఆర్ ఆర్ ఆర్` నిర్మాత దానయ్యకి కరోనా సోకింది. ఆయనకు మైన్యూర్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. అంతేకాదు సినిమాపై సస్పెన్స్ నెలకొంది.
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని దానయ్య డి.వి.వి తన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత దానయ్యకి కరోనా సోకింది. ఆయనకు మైన్యూర్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది.
ఇదిలా ఉంటే ఇటీవల రాజమౌళి ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసింది. ప్రస్తుతం వాళ్ళు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` నిర్మాతకి వైరస్ సోకడం గమనార్హం. అయితే రాజమౌళి కుటుంబం నుంచి దానయ్యకి వైరస్ సోకి ఉండొచ్చా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా రీషూట్కి సంబంధించి ప్లాన్ చేశారు. మరి ఆ సందర్భంలో వీరి కలిసి ఉండొచ్చని, దాన్నుంచి దానయ్యకి వైరస్ సోకి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు వాస్తవమనేది వారికే తెలియాలి.
కానీ ప్రస్తుతం అటు దర్శకుడు రాజమౌళికి, ఇటు నిర్మాత దానయ్యకి వైరస్ సోకడంతో `ఆర్ ఆర్ ఆర్` టీమ్ షాక్కి గురవుతుంది. దీని వల్ల ఇప్పుడు ఎన్టీఆర్, రామ్చరణ్ ఆందోళన గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి వారేమైనా ఇటీవల నిర్మాతగానీ, దర్శకుడినిగానీ కలిశారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి `ఆర్ ఆర్ ఆర్` నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి వైరస్కి గురి కావడం `ఆర్ ఆర్ ఆర్`పై సస్పెన్స్ నెలకొంటుంది. ముఖ్యంగా `ఆర్ ఆర్ ఆర్` ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని అర్థమవుతున్న నేపథ్యంలో అభిమానులు మరింత నిరాశకి గురవుతున్నట్టు టాక్.