Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కథ కథనాలతో ముందుకి దూసుకుపోతుంది. ఉమ్మడి కుటుంబం కథాంశంతో సాగుతుంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో చారు రావడం గమనించి పడుకున్నట్లుగా నటిస్తాడు శీను. నీకోసం కొత్త బట్టలు తెచ్చాను లెగు అంటుంది చారు. ఆమె కేకలకి ఎక్కడ మావయ్య వచ్చేస్తాడో అని తప్పక లెగుస్తాడు శీను. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. హ్యాపీ ఉగాది అంటుంది చారు. నాకెందుకు చెప్తావు అవన్నీ  అదంతా అమ్మ వాళ్లకి చెప్పు నన్ను ఇబ్బంది పెట్టకు అంటాడు శీను.

నువ్వు నాకు కాబోయే భర్త వి కదా నీకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి కదా అంటూ తను తెచ్చిన బట్టలు చూపిస్తుంది చారు. నా మనసేమీ బాగోలేదు ఈ పండగ మీరే చేసుకోండి అంటాడు శీను. నువ్వేమో ఇలా అంటున్నావు అవతల రామలక్ష్మి, ఆద్య టిప్పుసుందరిల్లాగా రెడీ అయ్యారు అంటుంది. అవునా బట్టలు తర్వాత వేసుకుంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు శీను.

అంతలోనే అక్కడికి వచ్చిన పద్మ,  చారు పిలిచినా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్లి పోతున్నావు అని అడుగుతుంది.  బావ పండగ చేసుకోడంట అని చెప్తుంది చారు. ముందు  ఆ బట్టలు వేసుకో అంటుంది అతని తల్లి. నా మనసు బాలేదు నన్ను టార్చర్ పెట్టొద్దు అంటాడు శీను. ఎవరైనా ఏమైనా అన్నారా అంటుంది  అతని తల్లి. ఏమీ లేదు ముందు మీరు ఇకనుంచి వెళ్లిపోండి అంటాడు శీను.

మీ సమస్యని నాతో కాకపోతే నాన్నతో గాని మామతో కానీ చెప్పు అంతేకానీ ఇలా ఉండకు అంటుంది పద్మ. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనీయండి అంటూ వాళ్ళిద్దర్నీ బలవంతంగా గదిలోంచి బయటకు పంపించేస్తాడు శీను. మరోవైపు బిట్టుతో మీ అమ్మ కొత్త బట్టలు తీసుకొస్తుంది అని చెప్తాడు వాళ్ల నాన్న. చాక్లెట్ కి రూపాయి అడిగితే ఇవ్వదు అలాంటిది కొత్త బట్టలు తీసుకొస్తుందా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు బిట్టు.

 నిజంగానే నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను అంటూ బ్యాగులోంచి అమ్మాయి బట్టలు తీస్తుంది బిట్టు తల్లి. ఆ బట్టలు నాకెందుకమ్మ చెల్లి పుడితే వేద్దాంలే అంటాడు బిట్టు. కాదు నేను నీకోసమే తెచ్చాను అంటూ ఆ బట్టలు బిట్టుతో వేయించడానికి 
తెగ ప్రయత్నిస్తారు అతని తల్లిదండ్రులు. వేసుకోను అంటూ పట్టు పడతాడు బిట్టు. మరోవైపు ఉగాది పచ్చడి ప్రత్యేకత ఆద్య కి చెప్తుంది జానకమ్మ.

 ఈ పచ్చడిలో ఇంత అర్థం ఉందా అంటుంది ఆద్య. అదే తెలుగు పండగల ప్రత్యేకత అంటుంది జానకమ్మ. రామలక్ష్మి, ఆద్యలతో దగ్గరుండి ఉగాది పచ్చడి తయారు చేయిస్తుంది జానకమ్మ. మరోవైపు కొడుకు గురించే గాని నా గురించి పట్టించుకోవా నాకేమీ కొత్త బట్టలు అని భార్యని అడుగుతాడు వెంకట్రావు. ఈ వయసులో మీకు కొత్త బట్టలు అవసరమా పోయిన సంవత్సరం కొన్న ఉన్నాయి కదా అవి వేసుకోండి  అంటుంది పద్మ.

 నన్ను అడిగితే నేను తెచ్చేదాన్ని కదా అంటుంది చారు.ఆయనకేమీ కొత్త బట్టలు అక్కర్లేదు అంటూ చారుని తీసుకుని వెళ్ళిపోతుంది పద్మ. మొగుడు అంటే బొత్తిగా ఖాతరు లేదు  అనుకుంటాడు వెంకట్రావు . పద్మ నేరుగా జానకమ్మ దగ్గరికి వచ్చి నువ్వు రామలక్ష్మి తోని ఆధ్యతోనే మాట్లాడుతున్నావు కానీ మా ఎవరు గురించి పట్టించుకోవడం లేదు అంటుంది. మీకేం కావాలో అడగండి చేసి పెడతాను అంటుంది జానకి.

 శీను తల్లిదండ్రుల మాట వినడు మీరు చెప్తే వింటాడు పండగపూట కొత్త బట్టలు వేసుకోడంట మనసు ఏమి బాగోలేదు అంటున్నాడు అంటుంది పద్మ. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా అంటుంది జానకి ఇంట్లో వాళ్ళు ఎందుకంటారు బయట వాళ్లే అని ఉంటారు అంటుంది చారు. ఇంతకీ ఏమంటున్నాడు అంటుంది జానకి. కొత్త బట్టలు వేసుకోను, పండగ చేసుకోను అంటున్నాడు అంటుంది చారు.

 అంతలోనే అక్కడికి వచ్చిన వెంకట్రావు  వాడికి నువ్వంటే కోపం చారుని ఇంటిలో ఉండనిచ్చినందుకు అంటాడు. తను ఈ ఇంటికి కాబోయే కోడలు అంటుంది పద్మ. ఎవరో వాడిని బాధ పెట్టారు కానీ చెప్పడం లేదు వాడిలో వచ్చిన మార్పులు చూస్తే కంగారుగా ఉంది అంటుంది పద్మ. దానికే అంత కంగారెందుకు నేను చెప్తాను అంటుంది జానకి. అంతలోనే అక్కడికి వచ్చిన రఘురాం ఏమైంది అని అడుగుతాడు.

జరిగింది చెప్తుంది పద్మ. బావగారు ఏమైందో మీరు వెళ్లి కనుక్కోండి అంటూ వెంకట్రావుకి  చెప్తాడు రఘురాం. మర్చిపోలేక పోతున్నాను నా మనసుతో యుద్ధం చేస్తున్నాను అనుకుంటాడు శీను. అంతలోనే అక్కడికి వచ్చిన తండ్రిని చూసి ఇప్పుడు మీరు వచ్చారు ఇందాక అమ్మ వచ్చింది నన్ను ప్రశాంతంగా ఉండడానికి అడుగుతాడు శీను.

 పండుగ పబ్బం అనేసరికి  నువ్వే ముందుంటావు కదా అయినా మొన్న ఊరు వెళ్తాను అన్న దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు అదొక లాగా ఉంటున్నావు అంటాడు వెంకట్రావు . నీ మనసుకైన గాయానికి ఏమందు వెయ్యాలో అర్థం కావడం లేదు అందరితోనూ కలిసి ఉంటే మనసు కుదుటపడుతుంది అని నచ్చ చెప్తాడు శీను తండ్రి. నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు వెళ్ళండి అని శీను అంటే మీ మావయ్య పిలుస్తున్నారు అంటాడు వెంకట్రావు.

అయినా ఆలోచనలో ఉన్న శీను ని ఏమైంది రా మీ మామయ్య పిలుస్తున్నారు అనగానే పరిగెత్తుకొని వెళ్లేవాడివి కదా అంటాడు. అంతలోనే అక్కడ ఉన్న కొత్త బట్టల్ని చూసి బాగున్నాయి వేసుకో అంటాడు. వద్దు నాన్న కావాలంటే మీరు వేసుకోండి అంటాడు శీను. వేసుకుంటే మీ అమ్మ తిడుతుంది రా అంటాడు వాళ్ళ నాన్న. అమ్మతో నేను చెప్తాను మీరు వేసుకోండి ఉంటాడు శీను.

 సరేలే నువ్వు మావయ్య దగ్గరికి వెళ్ళు అంటూ బట్టలు వేసుకునే పనిలో పడతాడు వెంకట్రావు. హాల్లోకి వచ్చిన శీను రమ్మన్నారంట అని అడుగుతాడు. ఎందుకు పండగ పూట గదిలో కూర్చున్నావు చారు వాళ్ళు బట్టలిస్తే వేసుకోలేదంట ఎందుకు అని అడుగుతాడు రఘురాం. మనసేమీ బాగోలేదు అంటాడు శీను. నీకు అంత  బాగోలేనప్పుడు మేము మాత్రం పండగ ఎలా చేసుకుంటాం పండుగ ఆపేద్దాం అంటాడు రఘురాం తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.