Asianet News TeluguAsianet News Telugu

`జబర్దస్త్` హైపర్‌ ఆదిపై ఫిర్యాదు.. మల్లెమాలపై కూడా

`జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి సోమవారం వీరు ఫిర్యాదు చేశారు.

complaint filed againt jabardasth comedian hyper aadi  arj
Author
Hyderabad, First Published Jun 14, 2021, 3:46 PM IST

`జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి సోమవారం వీరు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో తెలంగాణ భాషని, బతుకమ్మని, గౌరమ్మని కించపరిచేలా మాట్లాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదితోపాటు ఆ స్కిట్‌ రైటర్‌పై, మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. 

గతంలో హైపర్‌ ఆదిపై మానవ హక్కుల సంఘానికి(హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్‌ ప్రదర్శిస్తున్నారంటూ అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆది చుట్టూ కేసులు నమోదవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇదిలా ఉంటే `జబర్దస్త్` ద్వారా పాపులర్‌ అయిన హైపర్‌ ఆది, తన పంచ్‌ డైలాగ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలపై ఆయన పంచ్‌ లు బాగా పేలేవి. అయితే ఈక్రమంలోనే ఆయన పంచ్‌లు, స్కిట్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆది `జబర్దస్త్`తోపాటు `ఢీ` ఛాంపియన్స్, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్‌లో పాల్గొంటున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios