Asianet News TeluguAsianet News Telugu

‘వేదాళం’ రీమేక్ కి చిరు హిట్ సినిమా బ్యాక్ డ్రాప్

సిరుతై శివ తమిళంలో దర్శకత్వం వహించిన వేదాలం లో  అజిత్‌  కోల్‌కతాలో టాక్సీ డ్రైవర్‌గా ..అండర్ వరల్డ్‌తో పోరాడుతాడు. ఈ చిత్రం తరువాత బెంగాలీలో సుల్తాన్ (2018) గా రీమేక్ చేయబడింది, ఇందులో జీత్ ప్రధాన పాత్రలో నటించారు.
 

Chiranjeevi Vedalam Remake In Kolkata Backdrop
Author
Hyderabad, First Published Oct 5, 2020, 9:59 AM IST


తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘వేదాళం’. ఈ మూవీ తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటిచంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై మెహర్ రమేష్ గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. సినిమాలో చిరు స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో చాలా మార్పులే చేసారట. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కీ పోర్షన్స్ కు బ్యాక్ డ్రాప్ గా కోలకతా ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవి ..గుండుతో కనపడతారు.  గతంలో చిరంజీవి నటించగా పెద్ద హిట్టైన చూడాలని ఉంది సినిమా సైతం కోలకతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకు సైతం అదే బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నట్లు సమాచారం.  

సిరుతై శివ తమిళంలో దర్శకత్వం వహించిన వేదలం లో  అజిత్‌  కోల్‌కతాలో టాక్సీ డ్రైవర్‌గా ..అండర్ వరల్డ్‌తో పోరాడుతాడు. ఈ చిత్రం తరువాత బెంగాలీలో సుల్తాన్ (2018) గా రీమేక్ చేయబడింది, ఇందులో జీత్ ప్రధాన పాత్రలో నటించారు.
 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా హీరోయిన్ సాయి పల్లవి నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే  దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. మాతృకలో లక్ష్మీ మీనన్ అజిత్ చెల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించబోతున్నట్లు వినికిడి. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios