ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు.. హాట్ టాపిక్గా మారిన చిరు ట్వీట్స్.. గాడ్ ఫాదర్పై హైప్..
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళన కాన్సెప్ట్తో తెరకెక్కిన మలయాళ చిత్రం లూసిఫర్కు గాడ్ ఫాదర్ రీమేక్ కావడమే. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో గాడ్ ఫాదర్ చిత్రంలో.. డైలాగ్లు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. చిత్ర ప్రమోషన్ భాగంగా విడుదల చేసిన ట్రైలర్, డైలాగ్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.
‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అంటూ చిరంజీవి ట్విట్టర్లో పోస్టు చేసిన ఆడియో క్లిప్ తెగ వైరల్గా మారింది. దీంతో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. ట్విట్టర్లో ఇలాంటి పోస్టు చేయడం హాట్ టాపిక్గా మారింది.
అప్పటి నుంచే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్ను సోషల్ మీడియాలో, సినిమా ప్రమోషన్స్లో ఎక్కువగా ప్రస్తావించడంతో చిరంజీవి అభిమానులతో పాటు, పవన్ అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. బుధవారం అనంతపురంలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్లో కూడా చిరంజీవి.. సినిమాలోని డైలాగ్లు చెప్పి అభిమానులను ఉత్సహపరిచారు. అంతేకాకుండా వర్షంలోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘‘నేనెప్పుడూ సీమకు వచ్చిన ఆ నేల తడుస్తుంది. పులివెందులలో పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు.. ఇంద్ర సినిమా షూటింగ్లోనూ వర్షం కురిసింది. ఈరోజు కూడా వర్షం పడటం శుభపరిణామం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవల వదలిన డైలాగ్పై చర్చలు, డిబేట్లు ఎన్నో జరిగాయని చెప్పారు. అదే సమయంలో వేదికపై నుంచి మరో డైలాగ్ను చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంపై మరింత హైప్ పెంచేలా చిరంజీవి మరో డైలాగ్ను ట్విట్టర్లో పోస్టు చేశారు. గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్కు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్లో పోస్టు చేసిన చిరంజీవి.. మంచి ప్రతిభ ఉన్న ఆయనకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు.
‘‘ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళూ.. ఇకనుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా.. ఇందులో ఒకటే రూల్.. ఇకనుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం, తప్పుచేయ్యాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే ..మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది..’’ అని త్వరలో విడుదల కానున్న గాడ్ ఫాదర్ చిత్రంలోని డైలాగ్ షేర్ చేశారు. ఇదే డైలాగ్ను చిరంజీవి నిన్న వేదికపై నుంచి కూడా చెప్పారు.
అయితే ఇవన్నీ సినిమా ప్రమోషన్లో భాగంగానే చిరంజీవి చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత రాజకీయాలకు సరిగ్గా సరిపోయేలా డైలాగ్స్ ఉన్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి గతంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి కావడంతో.. ఈ డైలాగ్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లోను చర్చనీయాంశంగా మారాయి.