Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు, కృష్ణకు ఓదార్పు.. చిరు,పవన్, బాలయ్య, చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు సంతాపం


ఇందిరాదేవి మరణం సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణతో పాటు మహేష్ం బాబు ఇతరకుటుంబ సభ్యులు ధుఖంలో మునిగిపోయిన వేళ.. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. రాజకీయ రంగంనుంచి కూడా ఇద్దరు స్టార్లకు సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ సినీ ప్రముఖులు సంతాపాలు ప్రకటిస్తున్నారు. 

chiranjeevi pawan Balakrishna condolence Maheh Babu Mother Indira Devi demise
Author
First Published Sep 28, 2022, 10:19 AM IST

ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు నందమూరి బాలకృష్ణ..ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు బాలయ్య.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా  ఇందిరా దేవి మృతికి  సంతాపం తెలిపారు.. శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ  సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు  మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి 

 


అటు తెలుగుదేశం అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహేష్ బాబు, కష్ణలను ఓదార్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా రాశారు. ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేష్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధ నుండి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ...ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. 

 


                                                                                    
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇందిరా దేవి మృతికి సంతాపం ప్రకటించారు.ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను.  అని అన్నారు పవన్. 

అటు ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా ఇందిరా దేవి మృతికి సంతాపం ప్రకటిచారు. ట్వీట్టర్ వేదికగా ఆయన మహేష్,కృష్ణతో పాటు ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు.  


 

 

ఏపీ కాంగ్రెస్ చీఫ్ కూడా తన సంతాపం ప్రకటిచారు.. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారు మరణం పట్ల సంతాపం ప్రకటించిన ఎపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని  ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios