Asianet News TeluguAsianet News Telugu

వీరాభిమాని చివరికోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి, గుండెలకు హత్తుకుని....

మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు చాటుకున్నారు. అసలు తీరికలేకుండా గడుపుతున్న చిరు.. తన అభిమాని చివరి కోరికను స్వయంగా తెలుసుకుని తీర్చారు. అతనిలో ఆత్మ స్తైర్యం నింపారు. 
 

Chiranjeevi fulfilled the last wish of his fan Nagaraju
Author
Hyderabad, First Published Aug 9, 2022, 6:43 AM IST

ఫుల్ బిజీ షెడ్యూల్... నాలుగు సినిమాలు.. ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడే తీరికలేకుండా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమాని చివరికోరిక తీర్చడం కోసం అన్ని పనులు మానుకున్నారు. తనను ప్రణం కంటే ఎక్కువగా ప్రేమించి అభిమాని గుండెల్లో ధైర్యం నింపారు.. గుండెలకు హత్తుకుని ఓదార్చారు. బాధతో నిండి ఉన్న ఆ వ్యాక్తి ముఖంపై చిరునవ్వు వచ్చేలా చేశారు.

 తనను ప్రేమించే అభిమానుల విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకునే మెగాస్టార్.. ఎంతో మంది అభిమానులను ఆర్థికంగా ఆదుకున్నారు కూడా.. మెగాస్టార్‌ చిరంజీవి.. సెలబ్రిటీలనే కాదు ఫ్యాన్స్‌ను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు. అభిమానికి ఆపద వస్తే అండగా నిలబడతాడు. తాజాగా చిరు తన అభిమాని కోరికను నెరవేర్చాడు. చిరంజీవి సోంత ఊరు అయిన మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన వెంటనే స్పందించారు. 

 

వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందించాడు. అంతేకాక ఆర్థిక సహాయం కూడా కల్పించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా చిరు మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేపోతున్నారు నెటిజన్లు.

కెరీర్ బిగినింగ్ నుండి కూడా హీరోగా.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. గొప్ప క్రేజ్ అందుకోవడం మాత్రమే కాదు.. సందర్భం ప్రకారం  తోటి వారికి సహాయం చేసి గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన మెగాస్టార్ గా ఎదిగి... ఇండస్ట్రీకి ఓ పెద్దగా ఉంటూ.. పరిశ్రమ బాగోగులు చూసుకుంటున్నారు. ఎక్కడ ఏ కష్టమెచ్చినా నేనున్నా అన్న భరోసా ఇస్తున్నారు చిరంజీవి. ఇక  రీసెంట్ గా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇండస్ట్రీ తరపున నిలిచి కరోనా వెల్ఫేర్ ఫండ్ స్థాపించి అనేకమంది సినీ కార్మికులకు సహాయం అందించారు.

ప్రస్తుతం చిరంజీవి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న గాడ్‌ఫాద‌ర్  మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ లో దసరా సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. దీనితో పాటుగా బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీర‌య్య  సినిమా కూడా  చేస్తున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి  అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా నటిస్తున్నాడు. రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాను చేస్తున్నాడుచిరు . కీదీనితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు కూడా సినిమా ఛాన్స్ ఇచ్చారు మెగా హీరో. త్వరలో ఈ సినిమా కూడా స్టార్ట్ కాబోతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios