చిరంజీవితో కృష్ణవంశీ సరికొత్త ప్రయోగం, కొత్త అవతారం ఎత్తబోతున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. మెగాస్టార్ తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. తన సినిమా కోసం మెగాస్టార్ వాయిస్ ను ఉపయోగించుకోబోతున్నాడు.
టాలీవుడ్ సీనియర్, టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగానికి రెడీ అయ్యాడు. చాలా కాలం తరువాత కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ . ఈ రంగమార్తాండ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం చేయబోొతున్నాడు స్టార్ డైరెక్టర్. అయితే మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ను ఈ సినిమాకు వాడుకోబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు గతంలో కూడా ఈ విషయంలో బయటకు వచ్చింది. అతయితే . ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్న మెగాస్టార్ కు ఓ టాస్క్ కూడా ఇవ్వబోతున్నాడట కృష్ణ వంశీ.
మెగాస్టార్ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తదేమీ కాదు. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రా తెలుగు వర్షన్ టీజర్ కు కూడా చిరంజీవి గాత్ర దానం చేశారు. గతంలో కూడా చాలా సినిమాలకు ఇంట్రోలు ఇచ్చారు. రకరకాల సందర్భాల్లో వాయిస్ తో పాటు పాటల కూడా పాడారు. అయితే ఈ సారి మాత్రం చిరు రంగమార్తాండ సినిమాతో అటు ఫ్యాన్స్ కు.. ఇటు ఆడియెన్స్ కు కొత్త ఫీలింగ్ ఇవ్వబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
చిరంజీవి వాయిస్ తో కృష్ణ వంశీ కొత్త ప్రయోగం చేస్తున్నాడట. వాయిస్ ఓవర్ టైమ్ లో తెలుగు కవిత్వం పఠించనున్నాడట చిరంజీవి. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కొత్తగా..మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగపూరితమైన లోతులను సృశించేలా చిరు వాయిస్ ఓవర్ ఉండబోతుందని సమాచారం. కృష్ణవంశీ తాను చేయబోయే ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడం ఖాయమని ధీమాగా ఉన్నాడట.
అంతే కాదు మెగాస్టార్ తో సాధారణంగా వాయిస్ చేయిస్తే ఏం బాగుంటుంది. ఇలా కొత్తగా ఉంటే.. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ రకంగా సినిమాకు పబ్లిసిటీ కూడా అవుతుంది.చాలా కాలంగా ఫెయిల్యూర్స్ లో ఉన్న కృష్ణ వంశీ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే చాలా వరకూ కొత్తగా ఆలోచిస్తున్నాడు.
ఇక ఈ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆయన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇలా చాలా మంది సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.