Asianet News TeluguAsianet News Telugu

మొన్న 'అలా వైకుంఠపురంలో' .. ఇప్పుడు ‘ఆచార్య’ అక్కడే

కరోనా ఉద్ధృతి వల్ల నిలిచిపోయిన ‘ఆచార్య’  చిత్ర షూటింగ్‌ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది. త్వరలోనే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయనున్నారు. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి.

chiranjeevi Acharya to move to Kakinada!  jsp
Author
Hyderabad, First Published Jul 27, 2021, 10:08 AM IST

కాకినాడ పోర్ట్ లో ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. అది మన తెలుగు సినిమా మేకర్స్ కు ఫేవరెట్ షూటింగ్ స్పాట్.  అల్లు అర్జున్ ..అల వైకుంఠపురములో చిత్రంలో కొన్ని సీన్స్ అక్కడే షూట్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు అక్కడే కొద్ది రోజులు ఆచార్య కూడా మకాం వేయనున్నారు. ఆ సీన్స్ సినిమాకు కీలకంగా నిలుస్తాయిని వినికిడి. కొరటాల శివ ప్రత్యేకంగా ఈ సీన్స్ పై కసరత్తు చేసి,చిత్రీకరించబోతున్నారు. కాకినాడ తన అబిమాన హీరో వస్తూండటంతో అక్కడ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.

 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గటంతో సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం టీమ్ కాకినాడ పోర్ట్ లో ఇంపార్టెంట్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసింది. వచ్చే నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు కొరటాల శివ. ఆ మేరకు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. 
 
 రామ్‌చరణ్‌‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ మధ్యన తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. అలాగే ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది.  అయితే ‘ఆచార్య’ థియేటర్లో పాఠాలు ఎప్పటినుంచి చెప్పనున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. 
 
 ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి హీరో రామ్‌ చ‌ర‌ణ్ కొణిదెల బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం 150 తర్వాత మరోసారి చిరంజీవితో ఈ సినిమాలో జోడీ కడుతుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. మణిశర్మ చాలా ఏళ్ళ తర్వాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  దేవాదాయ భూముల స్కామ్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు కొరటాల.  అలాగే చరణ్ కు హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios