ఛార్మీకి ఏ ఆఫర్స్ వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఛార్మి తెరపై కనిపించలేదు.. ఇక కనిపించనని క్లారిటీ కూడా ఇచ్చేసింది ఛార్మి. ఆ తర్వాత పూర్తి గా పూరి దగ్గరే సెటిలైంది. పూరి ప్రొడక్షన్ లో పనిచేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆమె సినిమాకు సంభందించి అన్ని విభాగాలు చూసుకోవటం మొదలెట్టింది.
హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఛార్మి దాదాపు యాభై సినిమాలు దాకా చేసింది. వరస ఫ్లాఫ్ లు పలకరించటంతో మెల్లిగా పేడవుట్ అయ్యింది. అందరు హీరోయిన్స్ లా తన స్వస్ధానానికి ఆమె వెళ్లిపోతుందని అంతా భావించారు. అయితే మళ్లీ పూరి తో కలిసి జ్యోతిలక్ష్మి అంటూ పలకరించింది. ఆ సినిమా కూడా వర్కవుట్ కేలుదు. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఛార్మి తెరపై కనిపించలేదు.. ఇక కనిపించనని క్లారిటీ కూడా ఇచ్చేసింది ఛార్మి. ఆ తర్వాత పూర్తి గా పూరి దగ్గరే సెటిలైంది.
పూరి ప్రొడక్షన్ లో పనిచేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆమె సినిమాకు సంభందించి అన్ని విభాగాలు చూసుకోవటం మొదలెట్టింది. నటీనటుల రెమ్యునేషన్స్ నుంచి సినిమా బిజినెస్ దాకా ఛార్మి చూస్తోంది. అయితే అవన్ని ఎవరికీ అక్కర్లేదు. హిట్ అనేది ఇండస్ట్రీకి అవసరం. ఆ హిట్ ఆమెకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో దొరికింది. పూరి సైతం ఆమె కు చాలా ఇంప్రెస్ అయ్యిపోయాడు.
ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్ ఈవెంట్ లో ఆమె గురించి చెప్పాడు. కేవలం ఛార్మి మనీ మేనేజ్మెంట్ స్కిల్ వల్లే తాను చాలా తక్కువలో ఇస్మార్ట్ శంకర్ తీయగలిగానని అన్నారు. దాంతో ఇండస్ట్రీలో ఆమె గురించి మాటలు మొదలయ్యాయి. దాంతో ఆమె వెనక చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు పడుతున్నారట. ఆమెను తమ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పెట్టుకునే కూల్ గా ఉండచ్చనే నిర్ణయానికి వచ్చారట. ఆమెకు రెమ్యునేషన్ గా కోట్లు ఆఫర్ చేస్తున్నారట.
అయితే ఛార్మీ వాళ్లవెరితోనూ ముందుకు వెళ్లే ఆలోచన లేదట. పూరి జగన్నాథ్ తదుపరి సినిమాకోసం ఆమె అప్పుడే పనిలో పడిపోయింది. పూరి ఆమెను కో ప్రొడ్యూసర్ తన సినిమాను చూడమని చెప్తున్నారట. ఒకప్పుడు ఛార్మి సెట్ లో ఉండి అధారిటి చేస్తే మేము పని చెయ్యలేమన్న హీరోలు, నిర్మాతలు సైతం పూరితో పనిచేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఛార్మి ఖచ్చితంగా తమ ప్రాజెక్టులో ఉండాలనే కండీషన్ పెడుతున్నారట. సక్సెస్ మనుష్యుల మైండ్ సెట్ పూర్తిగా మార్చేస్తుంది.