కోలీవుడ్ హీరో శరత్ కుమార్ పై నడిగర్ సంఘం సభ్యులు పూచ్చి మురుగన్ చెన్నై పోలీస్ కమీషనర్ కు 

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ పై నడిగర్ సంఘం సభ్యులు పూచ్చి మురుగన్ చెన్నై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘానికి సంబంధించిన కొన్ని భూములను శరత్ కుమార్, నటుడు రాధారవి అలానే మరో ఇద్దరు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గతంలో విశాల్ కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్ పై పలు కేసులు నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయనపై కేసు నమోదైంది. నడిగర్ సంఘానికి అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు వెల్లడించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో శరత్ కుమార్ పై ఇటువంటి ఆరోపణలు రావడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కావాలనే ఆయన ఇమేజ్ ను దెబ్బ తీయాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.