Asianet News TeluguAsianet News Telugu

ట్రాజడీ రోల్ లో బ్రహ్మానందం, చనిపోతాడట!

ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్‌బల్బ్‌ మూవీస్‌, హౌస్‌ఫుల్‌ మూవీస్‌, ఎస్వీఆర్‌ గ్రూప్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి షూటింగ్ మొదలెట్టారు. అయితే కరోనా తో ఆ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని ఓ కీలకమైన విషయం బయిటకు వచ్చింది.

Brahmanandam in Krishna Vamsi latest Rangamarthanda movie
Author
Hyderabad, First Published Aug 2, 2020, 12:15 PM IST

చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కొత్త సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్‌బల్బ్‌ మూవీస్‌, హౌస్‌ఫుల్‌ మూవీస్‌, ఎస్వీఆర్‌ గ్రూప్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి షూటింగ్ మొదలెట్టారు. అయితే కరోనా తో ఆ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని ఓ కీలకమైన విషయం బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ‘రంగమార్తాండ’ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక ట్రాజెడీ రోల్ లో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు కీలకమైనది. ప్రకాష్ రాజ్ కు స్నేహితుడు పాత్ర అది. ఎమోషన్స్ తో నిండి ఉండే పాత్ర అది. ప్రధానంగా సెకెండ్ హాఫ్ లో  బ్రహ్మానందం పాత్ర చనిపోతుందని.. ఆ సీన్ లో బ్రహ్మానందం ప్రేక్షకులను ఏడిపిస్తారట. అయితే ఇన్నాళ్ళూ మనని నవ్వించటమే పనిగా పెట్టుకున్న  బ్రహ్మానందంకు ట్రాజెడీ రోల్ సెట్ అవుతుందా అని మీడియా వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే బ్రహ్మానందం ..ఎలాంటి పాత్ర అయినా అద్బుతంగా పండించగలరు.
 
ఇక 2016లో వచ్చిన మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’కి మహేష్‌మంజ్రేకర్‌ దర్శకత్వం వహించగా, నానా పాటేకర్‌ ప్రధాన పాత్రను పోషించి, మరీ నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. కృష్ణవంశీ ఈ చిత్రానికి తెలుగుదనం తెచ్చే పనిలో స్క్రిప్టుని గత కొంతకాలంగా మెరుగులు దిద్దారు. కథాంశం ఏమిటంటే.. సినిమా నటుడిగా రిటైరైన వ్యక్తి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీజీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సతమతమయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
గతంలో మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన సినిమాను ధోని పేరుతో సౌత్లో రీమేక్ చేసిన ప్రకాష్ రాజ్, మరోసారి తానే దర్శక, నిర్మాతగా ప్రధానపాత్ర పోషిస్తూ నటసామ్రాట్ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే తన దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఆడకపోవటం... మనవూరి రామాయణం సినిమా డిజాస్టర్ అవటంతో కృష్ణవంశీని ఈ సినిమా చేయమని అడిగారని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios