ప్రముఖ హిందీ టీవీ నటి జరీనా రోషన్‌ ఖాన్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ హిందీ టీవీ నటి జరీనా రోషన్‌ ఖాన్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. `కుంకుమ్‌ భాగ్య` సీరియల్‌తో నటిగా విశేష గుర్తింపు పొందన ఆమె అకాల మరణంలో బాలీవుడ్‌ సినీ, టీవీ వర్గాలు, పలువురు సెలబ్రిటీలు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జరీనా రోషన్‌ ఖాన్‌ మరణంతో `కుంకుమ్‌ భాగ్య` సీరియల్‌ టీమ్‌ సైతం కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమెతో అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకి నివాళ్లర్పించారు. ఈ సీరియల్‌లో జరీనా.. ఇందూ దాది పాత్రలో నటించారు. సీరియల్‌ మాదిరిగానే ఈ పాత్ర కోసం బాగా ఫేమ్‌ అయ్యింది. ఆమె మరణంతో చలించిపోయిన టీవీ నటుడు షబీర్‌ అహ్లువాలియా, నటి శ్రీతి జాలు.. జారీనాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ సంతాపం తెలిపారు. 

`మీది చంద్రుడి వలే ఎల్లప్పుడు ప్రకాశించే ముఖం` అని షబీర్‌ పేర్కొంటూ సంతాపం తెలపగా, నటి శద్ధ ఆర్య స్పందిస్తూ, జరీనా మృతి నన్ను షాక్‌కి గురి చేసిందని, ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నానని, ఆమె మరణం తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు `కుంకుమ్ భాగ్య` లో నటించారని నటి మృణాల్‌ ఠాకూర్ అన్నారు. జరీనా కుంకుమ్‌ భాగ్యతో పాటు `యే రిష్టా క్యా కెహ్లతా`లో కూడా నటించారు. విన్‌ రానా, అనురాగ్‌ శర్మ వంటి సెలబ్రిటీలు ఆమెకి సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. జరీనా సీరియల్స్ తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు.

View post on Instagram
View post on Instagram
View post on Instagram