బాలీవుడ్ నటి అమీషా పటేల్ పై క్రిమినల్ కేసు, సుప్రీం కోర్డ్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ పై చీటింగ్ కేసు..క్రిమినల్ కేస్ నమోదు అయ్యింది. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్డు షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కీలక వాఖ్యలు చేసింది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటెల్ చీటింగ్ కేసు నమోదు అవ్వడంతో.. ఆమెకు జార్ఖండ్ ట్రయల్ కోర్టు సమాన్లు జారీ చేసింది.. అయితే ఈ సమన్లకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్ను సుప్రీం కోర్టు నిలివేసింది. అమీషా పటెల్ తనని మోసం చేసిందంటూ.. ఓ నిర్మాత వేసిన పటిషన్పై జార్ఖండ్ కోర్టు ఆమెకు గతంలో సమన్లు ఇచ్చింది. దీంతో తనపై ఈ క్రిమినల్ ప్రొసీడింగ్ను నిలివేయాలని కోరుతూ అమీషా పటేల్ సుప్రీం కోర్టుకు వెళ్లింది.
అసలు విషయం ఏంటీ అంటే.. అమీషా పటేల్ దేశీ మ్యాజిక్ సినిమాలోనటించే క్రమంలో నిర్మాత అజయ్ కుమార్ సింగ్ అమీషాకు 2.5 కోట్లు ఇచ్చాడట. అయితే డబ్బులు తీసుకుని కూడా అమీషా పటేల్ ఆ సినిమా చేయలేదు.. సినిమా చేయకపోగా, తన డబ్బులు తిరిగి కూడా ఇవ్వలేదని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్ కుమార్ సింగ్ అమీషా పటేల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈకేసును విచారించిన జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై నమ్మక ద్రోహం, మోసం వంటి సెక్షన్ల కింద కోర్టు సమాన్లు జారీ చేసింది.
అయితే ఈ కేసులను సవాల్ చేస్తూ హీరోయిన్ అమీషా పటేల్ సుప్రీం కోర్టుకు వెళ్ళారు. దానిని విచారించిన ధర్మాసనం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్లు జరపాలని జార్ఖండ్ కోర్టును ఆదేశించింది. అమీషాకు అనుకూలంగా తీర్పు రావడంతో..ఇక ముందు ఈ కేసులో ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు నెటిజన్లు కూడా ఈ విషయంలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. తరువాత తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో.. కుర్రకారును ఓ ఊపు ఊపింది అమీషా. ఐదు పదుల వయసుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్న అమీషా పటేల్ చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఇక బద్రి తర్వాత ఈ హీరోయిన్ అనేక సినిమల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా సినిమాలు రాలేదు. ప్రస్తుతం ఎప్పుడో ఒకటీ రెండు సినిమాలు చేసుకుంటుంది అమీషా.