తిన్నింటి వాసాలు లెక్కపెడుతోన్న హీరోయిన్లు!
తిన్నింటి వాసాలు లెక్కపెడుతోన్న హీరోయిన్లు!
తెలుగు సినిమాల్లో నటించి.. నిర్మాతల డబ్బు తిని ఆ తరువాత వేరే ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడ తెలుగు సినిమాల గురించి తప్పుగా మాట్లాడే హీరోయిన్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.
'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో టాలీవుడ్ ని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది.
'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన కామెంట్స్ చేసింది.
తెలుగులో 'రక్తచరిత్ర', 'లెజెండ్' వంటి చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధికాఆప్టే.
ఓ హీరో తనను సెట్స్ లో బాగా ఇబ్బంది పెట్టాడని, టాలీవుడ్ దర్శకనిర్మాతలు హీరోయిన్లకు కనీసం గౌరవం ఇవ్వరని కామెంట్స్ చేసి తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడింది రాధికా.
'ఝుమ్మందినాదం' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఎప్పుడైతే బాలీవుడ్ నుండి పిలుపు వచ్చిందో.. ఇక తెలుగు సినిమాల వంక చూడడం మానేసింది.
ఈ ఢిల్లీ భామ ఏకంగా రాఘవేంద్రరావుపైనే కామెంట్స్ చేసింది. బొడ్డు మీద కొబ్బరి చిప్పలు వేశారని వ్యంగ్యంగా మాట్లాడింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండదని బాలీవుడ్ అలా కాదని చెప్పింది.
తెలుగులో మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాలో కనిపించింది అమృతారావు. ఆ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు.
తెలుగు సినిమాల్లో నటించాకపోవడంపై ఈ బ్యూటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హీరోయిన్లకు సరైన ఇంపార్టెన్స్ ఉండదని, అందుకే తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఒక్కటి కూడా ఒప్పుకోలేదని చెప్పింది.