Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్.. అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరునిదర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు జాన్వీ కపూర్. 

Bollywood Heroine Janhvi Kapoor Visits Tirumala Temple
Author
First Published Dec 1, 2022, 6:24 PM IST

తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈరోజు తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం విఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం టైమ్ లో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గోన్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో.. వేదపండితులు వేదాశీర్వచనం అంద చేసిశ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. జాన్వీ కపూర్ రావడంతో తిరుమలలో సందడి వాతావరణం ఏర్పడింది. 

తరచూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటుంటారు జాన్వీ, ఆమెకు తిరుపతి  బాలాజీ అంటే ఎంతో ఇష్టం. అంతే కాదు ఇప్పటికీ చాలామార్లు తిరుమల దర్శనానికి వచ్చారు జాన్వీ. పోయిన సెప్టెంబర్ లోనే శ్రీవారి సేవలో పాల్గోన్న జాన్వీ కపూర్... రెండు నెలలటైమ్ లోనే మారో మారు శ్రీనివాసునిదర్శించుకున్నారు. 

వరుస సినిమాలతో దూసుకుపోతోంది జాన్వీ కపూర్. రీసెంట్ గా మిలి సినిమాతో సందడి చేసింది జాన్వీ కపూర్.. మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది. మిస్టర్ అండ్ మిసెస్ మహీతో పాటు బవాల్ సినిమా చేస్తోంది జాన్వీ కపూర్. ఇటు సౌత్ ఎంట్రీకి కూడా ఆమె రేడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇండస్ట్రీలో మాత్రం ఈ టాపిక్ గట్టిగా నడుస్తోంది. ఈ క్రమంలో జాన్వీ ఏ హీరో జోడీగా నటించబోతుందా అని అంతావెయిట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios