Asianet News TeluguAsianet News Telugu

కోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఎందుకంటే?

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) తాజాగా కోర్టుకెళ్లింది. గతేడాది కర్ణాటకకు బిజినెస్ మెన్ ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఈకేసులో జాక్వెలిన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించింది.

Bollywood heroine Jacqueline Fernandez goes to court, because?
Author
Hyderabad, First Published May 11, 2022, 5:24 PM IST

నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంకా విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసు సంబంధించిన ఎవరూ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. దీంతో తాజాగా జాక్వెల్లిన కొద్దిరోజులు విదేశ ప్రయాణాల కోసం కోర్టును ఆశ్రయించింది. 

అయితే  ఈ నెలలో దుబాయిలో ఐఫా 2022 (IIFA 2022) అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు  హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. ఈ అవార్డు వేడుకలో భాగంగా అబుదాబికి వెళ్లేందుకు కేసు నుంచి 15 రోజుల మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందులో భాగంగానే తర్వాత ఫ్రాన్స్ మరియు నేపాల్‌కు వెళ్లాలని భావిస్తున్నట్టు అప్లికేషన్ లో పేర్కొంది.

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. సుఖేష్ బాలీవుడ్‌ హీరోయిన్లు జాక్వెలిన్‌, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని ప్ర‌చారం సాగింది. సుకేశ్ చంద్రశేఖర్.. తాను దోచుకున్న డబ్బును ఉపయోగించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 5.71 కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చినట్లు అధికారులు ఇప్పటివరకు ఆధారాలను ఈడీ కనుగొంది. మ‌రోవైపు జాక్వెలిన్ స‌న్నిహిత బంధువుల‌కు 1.7 ల‌క్ష‌ల యూఎస్ డాల‌ర్లు, 27, 000 ఆస్ట్రేలియ‌న్ డాలర్లు ఇచ్చాడ‌ని చెబుతున్నారు.  ఈ కేసులు ఇటీవల ఈడీ జాక్వెలిన్ నుంచి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది.

ఈ కేసులో ఫెర్నాండెజ్‌తో పాటు, నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, శిల్పా శెట్టి మరియు హర్మాన్ బవేజా వంటి ఇతర బాలీవుడ్ ప్రముఖుల పేర్లను కూడా ఆరోపించారు. ఇక ఫెర్నాండెజ్ ఇటీవల సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీలో కనిపించింది. చివరిగా జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ నటించి యాక్షన్ మూవీ ‘అటాక్‌’లో నటించింది. ప్రస్తుతం ‘సర్కస్‌’,‘రామసేతు’ వంటి హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కన్నడ చిత్రం సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’లోనూ గెస్ట్ రోల్ లో కనిపించనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios