ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయను అన్నారు బాలీవుడ్ యంగ్ హీరో  కార్తీక్ ఆర్యన్.  రీమేక్ సినిమా కెరీర్ గురించి తనకు ఓ పాఠం నేర్పించింది అన్నారు   

టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో  సినిమా.  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈసినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈసినిమాను  అల్లు అరవింద్ హిందీలో షెహజాదా పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ నటించాడు. అక్కడ మాత్రం ఆమూవీ ప్లాప్ అయ్యింది. కలెక్షన్లు కూడాపెద్దగా రాలేదు. షెహజాదా రిలీజ్ అయ్యేసరికే అలా వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను చాలామంది చూసేశారు. ఇలా ఇంకా చాలా కారణాలతో ఈమూవీ బాలీవుడ్ లో ప్లాప్ అయ్యింది.  కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లో ఈ మూవీ అతి పెద్ద డిజస్టర్‌గా నిలిచిపోయింది. 

ఇక తాజాగా ఈసినిమా ప్లాప్ అవ్వడంపై స్పందించారు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన  తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇక ఎప్పుడూ రీమేక్స్ జోలికి వెళ్లనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ మూవీ తనకు ఒక అనుభవాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇక ఎప్పుడూ రీమేక్స్ చేకూడదని తెలియజెప్పిందని తెలిపాడు. నేను ఇక రీమేక్‌లు చేయను. రీమేక్ మూవీ చేయడం ఇదే తొలిసారి... ఇదే చివరి సారి కూడా అవుతుంది. మూవీ షూటింట్ టైమ్‌లో ఆఫీల్ కలగలేదు. మూవీ ఫ్లాప్ తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకున్నా. ప్రజలు ఇప్పటికే ఆ మూవీని చూసేశారని, మళ్లీ వారు డబ్బులు ఖర్చు చేసి అదే సినిమా చూడటానికి థియేటర్లకు ఎందుకు వెళ్తారని అర్థం చేసుకున్నా. అదే నా కళ్లు తెరిపించింది అని తెలిపాడు. 

రీమేక్ సినిమాల వల్ల తనకు ఆనందం కలగదని అర్ధం అయ్యిందంటున్నాడు కార్తీక్ ఆర్యన్. అలా చేయాలి అనుకుంటే ఇప్పటికి రీమేక్ స్క్రిప్ట్స్ తో నా దగ్గరకు వస్తుంటారు అంటూ కామెంట్ చేశారు.  ఇటీవల విడుదలైన ఇక రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా థియేటర్లలో ఆడుతుంది.. పాజిటీవ్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. . కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా షెహజాదా మూవీ 47 కోట్లు వసూలు చేసింది. ఇండియాన్ బాక్సాఫీస్‌లో38 కోట్లు మాత్రమే వచ్చాయి. నిర్మాతగా అల్లు అరవింద్‌కు కూడా ఈ మూవీ నష్టాలు మిగిల్చింది.

ఇక షెహజాదా మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ ధావన్ హిందీ వర్షన్ ను తెరకెక్కించాడు. ఈసినిమాలో కార్తీక్ ఆర్యన్‌కు జంటగా కృతి సనన్ నటించింది. ఈ ఏడాది ఫెబ్ లో  భారీ అంచనాల మధ్య మూవీ రిలీజ్ అయ్యింది. . అయితే తెలుగులో ఆకట్టుకున్నంతగా ఈ సినిమా హిందీ లో మెప్పించలేకపోయింది. ఈ మూవీను అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాట్ ఫిలిమ్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై నిర్మించారు.