Asianet News TeluguAsianet News Telugu

రొమాంటిక్ డేట్ లో అనన్య పాండే ‌- ఆదిత్య రాయ్ కపూర్‌, లండన్ లో లవ్ బర్డ్స్

తాజాగా లండన్ పర్యటన ముగించుకుని ఇండియాలో అడుగు పెట్టారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. పారెన్ లో వారి రొమాంటిక్ డేట్ కు సంబంధించినఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

bollywood couple ananya panday and aditya roy kapoor Romantic Date In London JMS
Author
First Published Jan 4, 2024, 10:13 AM IST

కొత్త ఏడాదికి కొంగొత్తగా ఎంజాయ్ చేశారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే -ఆదిత్య రాయ్ కపూర్‌. అయితే తమ బంధాన్ని భహిర్గతం చేసుకోకపోయినా.. కలిసి తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ కపుల్. ఫారెన్ టూర్లు వేస్తూ.. రొమాంటిక్ డేట్స్ ను ఎంజయ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా వీరి టూర్ కు సబంధించిన ఫోటోు కొన్ని బయటకు వచ్చాయి. కొత్త ఏడాదిని  లండన్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు జంట. ఇద్దరు ఏకాంతంగా రొమాంటిక్ డేట్ ను  ఎంజాయ్ చేశారు.లండన్ అందాలు ఆస్వాదిస్తూ.. సందడి చేశారు. 

అనన్య మరియు ఆదిత్యఇద్దరు ఒకరిచేయి మరికరు పట్టుకుని..   ఐస్ రింక్‌పై స్కేట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వెచ్చటి స్వెటర్లు వేసుకుని.. చలిగాలులు అక్కడక్కడ తగులుతుండగా..అద్భుతమైన సాయంత్రాన్ని స్టార్ కపుల్ స్కేటింగ్ చేస్తూ.. ఎంజాయ్ చేశారు. దాంతో వారి ప్రేమను ఇంకాస్త పెంచుకుని.. అనుబంధాన్ని బలపరుచుకున్నారు బాలీవుడ్ జంట. అయితే ఇలా గతంలో కూడా ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేశారు స్టార్ కపుల్. 

యూరప్ లో.. ఇలా రొమాంటిక్ టూర్ వేయడం అంటే ఇద్దరికి చాలా ఇష్టమట. గతంలో కెమెరాల కన్ను పడకుండా ఈ జంట చాలాసార్లు ఇలా వెళ్ళి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గత ఏడాది  స్పెయిన్‌లో జరిగిన ఆర్టిక్ మంకీస్ షోలో సందడి చేశారు స్టార్ కపుల్. అప్పుడు అభిమానులు కెమెరాలకు దొరికిపోయారు. సాధారణ టూరిస్టుల్లా.. స్పెయిన్ వీధుల్లో వీరు తిరుగుతూ.. అద్భుతమైన అందాలు ఆశ్వాదించారు. వారు అలా తిరుగుతుంటే.. కెమెరాల కళ్లు క్లిక్ మనిపించాయి. దాంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. 

ఇక వీరిరిలేషన్ పై అఫీషియల్ గా ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు జంట. ఇక సినిమాల విషయానికి వస్తే..  అనన్య పాండే  రీసెంట్ గా 'ఖో గయే హమ్ కహాన్' సినిమాల నటించింది. ఆదర్శ్ గౌరవ్ మరియు సిద్ధాంత్ చతుర్వేది డైరెక్షన్ లో ఈహూవీ తెరకెక్కింది. ఈసినిమాలో తనపాత్రకు గాను ఆమె ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ఏడాది అటే  2024 లో రెండు సినిమాలతో ముందుకు రాబోతోంది. కంట్రోల్' మరియు 'ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్'లో కనిపించనుంది.  అంతే కాదు కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా ఆమె తొలిసారి నటిస్తోంది. ఇక ఆదిత్య విషయానికి వస్తే.. అతను  చివరిసారిగా యాక్షన్-థ్రిల్లర్ 'గుమ్రా'లో కనిపించాడు ప్రస్తుతం అనురాగ్ బసు డైనెక్షన్ లో రూపొందుతున్న మెట్రో ఇన్ డినో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios