Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌బాస్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ బయటికొచ్చిన విన్నర్‌ అభిజీత్‌..సోహైల్‌, హారికలను నామినేట్‌

రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు. 

biggboss4 winner abhijit in green india challenge arj
Author
Hyderabad, First Published Dec 22, 2020, 5:01 PM IST

బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌ మాట్లాడుతూ, `బిగ్‌బాస్‌4 విన్నర్‌గా నిలిచిన తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఆయన ధన్యవాదాలు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి` అని అన్నారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న సోహైల్‌, హారిక, కళ్యాణిలను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios