Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: టికెట్ టు ఫినాలే రేసులో ఆ నలుగురు... ఉత్కంఠ రేపుతున్న టాస్క్స్!

నేరుగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. ఈ రేసులో నలుగురు తప్పుకోగా నలుగురు మరో నలుగురు మిగిలారు. 
 

bigg boss telugu 7 these four contestants in ticket to finale race ksr
Author
First Published Nov 30, 2023, 6:03 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్విని శ్రీ ,రతిక ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో టాప్ 8 ఉన్నారు. శివాజీ, అమర్, అర్జున్, గౌతమ్, ప్రశాంత్, ప్రియాంక, శోభ, యావర్ టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంది. 

అయితే ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఒకరికి ఉంది. ఎవరైతే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో సత్తా చాటి అత్యధిక పాయింట్స్ సాధిస్తారో వారికి ఫినాలే అస్త్ర దక్కుతుంది. టికెట్ టు ఫినాలే కోసం ఎనిమిది మంది పోటీపడ్డారు. తక్కువ పాయింట్స్ తో మొదట శోభ రేసు నుండి తప్పుకుంది. అనంతరం శివాజీ డిస్ క్వాలిఫై అయ్యాడు. ప్రియాంక కూడా రేసు నుండి తప్పుకుంది. 

యావర్ సైతం టికెట్ టు ఫినాలే గెలుచుకునే అర్హత కోల్పోయాడు. యావర్ తన పాయింట్స్ ప్రశాంత్ కి ఇవ్వడంతో ప్రశాంత్ రెండో స్థానంలోకి వచ్చాడు. నలుగురు రేసు నుండి తప్పుకోగా అమర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్ పోటీలో ఉన్నారు. అత్యధిక పాయింట్స్ తో అమర్ టాప్ లో ఉండగా ప్రశాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో గౌతమ్, నాలుగో స్థానంలో అర్జున్ ఉన్నాడు. 

ఈ క్రమంలో ఎవరు టికెట్ టు ఫినాలే గెలుస్తారనే ఉత్కంఠ నడుస్తుంది. ఈ నలుగురిలో అమర్ మాత్రమే నామినేషన్స్ లో లేడు. మిగతా ముగ్గురు నామినేట్ అయ్యారు. టికెట్ టు ఫినాలే గెలిచినప్పటికీ ఎలిమినేట్ అయితే ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉండదు. పల్లవి ప్రశాంత్ వద్ద అవిక్షన్ పాస్ ఉంది. కాబట్టి ఒకవేళ డేంజర్ జోన్లోకి వస్తే తనని తాను కాపాడుకుంటాడు. కానీ ఓటింగ్ లో దూసుకుపోతున్న పల్లవి ప్రశాంత్ కి అవిక్షన్ పాస్ అవసరం లేదు. ఇక టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios