బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. దాదాపు అందరూ స్వార్థం కోసమే ఆడతారు. రతికా రోజ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు...   

బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ ఫుల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా ఎలిమినేట్ అయ్యారు. మూడు వారం నామినేషన్స్ లో 7గురు ఉన్నారు. అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, ప్రిన్స్ యావర్,  గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, రతికా రోజ్, దామిని నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. అనంతరం బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. 

ముగ్గురు కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రెండు వారాల పెర్ఫార్మన్స్ ఆధారంగా ముగ్గురు సభ్యులను నెక్స్ట్ కంటెండర్ రేసుకు ఎంపిక చేస్తున్నాను. ఆ ముగ్గురిలో ఒకరికి మూడు వారాల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ పేర్లను బిగ్ బాస్ ప్రకటించాడు. అంటే ఈ ముగ్గురిలో ఒకరికి నెక్స్ట్ పవర్ అస్త్ర దక్కుతుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి అర్హత లేదో చెప్పాలని... ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ అడిగాడు. 

రతికా, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ... శోభా శెట్టికి అర్హత లేదని చెప్పారు. దామిని మాత్రం ప్రిన్స్ యావర్ పేరు చెప్పింది. మిగిలిన కంటెస్టెంట్స్ అభిప్రాయం ఆధారంగా ముగ్గురిలో ఒకరు రేసు నుండి తప్పుకుంటారనిపిస్తుంది. మిగిలిన ఇద్దరూ పవర్ అస్త్ర కోసం పోటీపడే అవకాశం ఉంది. 

ఇక రతికా రోజ్-పల్లవి ప్రశాంత్ మధ్య లొల్లి మొదలైంది. నీకు ఎన్ని సార్లు చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని రతికా రోజ్ అంది. నువ్వే పో అంటూ పల్లవి ప్రశాంత్ ఆమెను చేత్తో తాకి చెప్పే ప్రయత్నం చేశాడు. చెయ్యేస్తే బాగోదని పల్లవి ప్రశాంత్ కి రతికా రోజ్ వార్నింగ్ ఇచ్చింది. కాసేపు అతనితో మంచిగా ఉంటున్న పల్లవి మరి కాసేపట్లో రివర్స్ అవుతుంది. రతికా రోజ్ ప్రవర్తన అంతుబట్టడం లేదు..