గెలవడం కోసం బాల ఆదిత్య వీక్నెస్ పై దెబ్బ కొట్టిన గీతూ... నాగార్జున బూస్ట్ ఇచ్చినా అదే తీరు!
కంటెస్టెంట్ గీతూ ఆటతీరు మారడం లేదు. గేమ్ పేరుతో ఆమె కంటెస్టెంట్స్ ఆగ్రహానికి గురవుతుంది. తాజాగా బాల ఆదిత్య వీక్నెస్ తో ఆడుకొని అతడు బరస్ట్ అయ్యేలా చేసింది. ఫస్ట్ టైం బాల ఆదిత్య కన్నీరు పెట్టుకున్నాడు.
మంగళవారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీని కోసం బిగ్ బాస్ మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ కండక్ట్ చేశారు. ఇంటి సభ్యులను బ్లూ-రెడ్ అంటూ రెండు టీమ్స్ గా విభజించారు. ఒకటి టీమ్ సభ్యులు మరొక టీం సభ్యులను చంపాలి అనేది గేమ్. ఈ గేమ్ లో బాల ఆదిత్య, ఆదిరెడ్డి ఉన్న బ్లూ టీమ్ పై చేయి సాధించింది. గీతూ,రేవంత్ లతో కూడిన రెడ్ టీం బ్లూ టీంని ఓడించడానికి బాల ఆదిత్య వీక్నెస్ పై కొట్టాలి అనుకున్నారు.
బాల ఆదిత్య సిగరెట్స్, లైటర్ దాచేశారు.బాల ఆదిత్యకు లైటర్ కనిపించకపోవడంతో ప్రత్యర్థి టీమ్ చేరిన పనేనని గ్రహించాడు. లైటర్ ఇచ్చేయాలని కోరాడు. దానికి గీతూ డీల్ మాట్లాడింది. తమకు ఫేవర్ చేస్తేనే లైటర్, సిగరెట్స్ ఇస్తామని గీతూ బాల ఆదిత్యతో చెప్పింది. గీతూ మాటలు బాల ఆదిత్యకు విపరీతమైన కోపం తెప్పించాయి. గేమ్ ఆడకుండా ఇలా వీక్నెస్ పై కొట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదన్నాడు. వయసులో పెద్దవాడిగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే బాల ఆదిత్య సైతం బరస్ట్ అయ్యాడు.
అతడు గీతూ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసలు తనకు ప్రేమ లేదని కన్నీరు పెట్టుకున్నారు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. గేమ్ పేరుతో గీతూ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. గత వారం గీతూ ప్రవర్తన పరిధి దాటిపోవడంతో నాగార్జున క్లాస్ పీకాడు. అయినా గీతూలో పెద్దగా మార్పు వచ్చిన సూచనలు కనిపించడం లేదు. ఇక ఈ వారం నామినేషన్స్ లో 10 మంది ఉన్నారు. శ్రీహాన్, రాజ్, వాసంతి మినహాయిస్తే అందరూ నామినేట్ కావడం జరిగింది.