Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్లో రెండో రోజే మొదలైన మొగుడు పెళ్ళాల కొట్లాట... ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ
రెండో రోజే కపుల్ రోహిత్, మారిన మధ్య గిల్లికజ్జాలు మొదలయ్యాయి. తాను చెప్పేది సీరియస్ గా వినడం లేదని మారిన భర్త రోహిత్ పై గొడవకు దిగింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఫస్ట్ టైం భార్యాభర్తలకు ఎంట్రీ దొరికింది. హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు హౌస్లోకి ప్రవేశించారు. మిగతా వాళ్లతో కంటే వారిద్దరే తరచుగా గొడవపడేవారు. మూడు సీజన్స్ తర్వాత మరలా కపుల్ కోటాలో ఆర్టిస్ట్స్ రోహిత్, మారిన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రెండో రోజే ఈ జంట గలాటా ప్రారంభించారు. వాష్ రూమ్స్ దగ్గర మారిన భర్త రోహిత్ కి గీతూ గురించి ఏదో చెప్పబోయింది. ఆ సమయంలో రోహిత్ అద్దంలో తన బాడీ చూసుకుంటున్నాడు.
అది మారిన కు నచ్చలేదు. నువ్వు ముందు నీ బాడీ అయినా చూసుకో లేదంటే నేను చెప్పేదైనా విను అని విసుక్కుంది. అప్పుడు రోహిత్.. ఓకే ఇప్పుడు చెప్పు అన్నాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న మారిన నేను చెప్పనంటూ వెళ్ళిపోయింది. దానికి రోహిత్.. ఓవర్ యాక్షన్ చేయకంటూ తాను విసుక్కున్నాడు. ఇద్దరి మధ్య చిన్న డిస్టబెన్స్ ఏర్పడింది. హౌస్లోకి వచ్చిన రెండో రోజే గొడవపడటం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఈ జంట జర్నీ ఎలా సాగుతుందో అన్న ఆసక్తి రేపుతోంది.
బిగ్ బాస్ వేదికపై నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఈ జంట సింక్ అయ్యేలా సమాధానాలు చెప్పారు. కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే వీళ్ళ సింక్ తప్పింది. అంత గొప్ప అవగాహన ఉన్న ఈ జంట గొడవలు పడడం నిజంగా విడ్డూరం. అంతా బిగ్ బాస్ హౌస్ మహిమేమో. ఈసారి 21 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. నామినేషన్స్ ప్రక్రియ సైతం ఆసక్తికరంగా సాగింది. అలాగే ఇంటెరెస్టింగ్స్ టాస్క్స్ తో షో హాట్ హాట్ గా నడుస్తుంది.