Asianet News TeluguAsianet News Telugu

పాయసం కోసం రేవంత్-శ్రీహాన్ ల పంచాయతీ... రోహిత్-ఆదిరెడ్డి మధ్య ఉత్కంఠ పోరు, గెలిచిందెవరు?

స్నేహితులు రేవంత్, శ్రీహాన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాయసం డిస్ట్రిబ్యూషన్ విషయంలో వివాదం జరిగింది. ఇక కోల్పోయిన ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు రోహిత్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. 
 

Bigg boss telugu 6 adireddy and rohit face off for a task
Author
First Published Dec 7, 2022, 2:43 PM IST

బిగ్ బాస్ షో మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళతారు. కాగా హౌస్లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఒక టీమ్ గా ఉంటున్నారు. వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకటై పోతున్నారు. తాజాగా పాయసం వద్ద ఇద్దరికీ పంచాయితీ జరిగింది. 

బిగ్ బాస్ హౌస్లో పాయసం చేశారు. తమ వంతు పాయసం తర్వాత తింటానని శ్రీహాన్ చెప్పాడు. లంచ్ తర్వాత పాయసం తింటే బాగుంటుందని ఆదిరెడ్డి అభిప్రాయపడ్డాడు. శ్రీహాన్, శ్రీసత్య పాయసం అందరితో పాటు తినలేదు. రేషన్ మేనేజర్ గా ఉన్న రేవంత్ తర్వాత వారు తినడానికి నిరాకరించాడు. ఇది గొడవకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. హౌస్లో ఈ తిండి గొడవలు ఇంకా ఎన్నాళ్లని ఆడియన్స్ అంటున్నారు. 

ఇక బిగ్ బాస్ ఒక వారం టాస్క్ లు పెట్టి ప్రైజ్ మనీ తగ్గించాడు. ఆ డబ్బులు తిరిగి గెలుచుకునే అవకాశం కంటెస్టెంట్స్ కి ఇస్తున్నాడు. దీనిలో భాగంగా రోహిత్-ఆదిరెడ్డి ఒక టాస్క్ లో పోటీపడ్డారు. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి విన్నర్ అవుతాడని ఇంటి సభ్యులు మద్దతు తెలిపారు. ఒక్క శ్రీసత్య మాత్రం రోహిత్ విన్నర్ అవుతాడని అతడికి ఓటేసింది. టాస్క్ లో గెలిచేందుకు ఇద్దరూ హోరాహోరీ తలపడ్డారు. విన్నర్ ఎవరనేది ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. 

ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, శ్రీసత్య, ఇనయా నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎలిమినేషన్ కి ఇది చివరి వారం కావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని సమాచారం. డిసెంబర్ 18 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే కాగా... టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios