Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 3: గుడ్ల కోసం కంటెస్టెంట్స్ రచ్చ!

బిగ్ బాస్ సీజన్ 3 రంజుగా పసందుగా నాలుగోవారం ఇంట్రస్టింగ్‌ సాగుతోంది. 16 మందితో మొదలైన బిగ్ బాస్ ప్రయాణం నాలుగోవారానికి చేరే సరికి హౌస్‌లో 13 మంది మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు ఉండటంతో ఆట రంజుగా సాగుతోంది.
 

Bigg Boss 3 : tough task to next captain
Author
Hyderabad, First Published Aug 14, 2019, 7:58 AM IST

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కి ఏడుగురు నామినేట్ కావడంతో మంగళవారం నాటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు.

విక్రమ్ పురి, సింహాపురి అని రెండు రాజ్యాలుగా హౌస్ ని విడగొట్టి గుడ్ల కోసం కొట్లాట పెట్టారు. రెడ్ టీం కి లీడర్ గా శ్రీముఖిని పెట్టగా.. బ్లూ టీం కి లీడర్ గా హిమజను  నియమించారు.

ఈ రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. గేమ్ లో ఉన్న గుడ్లను సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని గేమ్ మొదలుపెట్టించారు బిగ్ బాస్. ఇక జెండాల కోసం, గుడ్ల కోసం ఒకరిపై ఒకరు పడుతూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ యాక్షన్ ఫీట్లు చేశారు.

ఈ గేమ్ లో చాలా మందికి గాయాలు కాగా.. మహిళా కంటెస్టెంట్స్ తో మేల్ కంటెస్టెంట్స్ ఆడేసుకున్నారు. గేమ్ ని సిల్లీగా తీసుకుంటున్నారు కాబట్టి వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios