Asianet News TeluguAsianet News Telugu

నాని `శ్యామ్‌సింగరాయ్‌` కోసం 6.5కోట్లతో భారీ సెట్‌.. ఏకంగా కోల్‌కత్తానే..

నాని హీరోగా నటిస్తున్న `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమా కోసం కోల్‌కత్తాని సృష్టించబోతున్నారు. హిస్టారికల్‌ నగరమైన కోల్‌కత్తాని ఏకంగా హైదరాబాద్ కి తీసుకురాబోతున్నారు. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.

big set re create in hyderabad for nani starrer shyam singha roy  arj
Author
Hyderabad, First Published Apr 18, 2021, 5:18 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని సాహసం చేయబోతున్నాడు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన `టక్‌ జగదీష్‌`లో రాయలసీమ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు `శ్యామ్‌సింగరాయ్‌`లో ఓ పీరియాడికల్‌ స్టోరీని, హిస్లారికల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఓ డిఫరెంట్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని విడుదలైన ఫస్ట్ లుక్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కోల్‌కత్తాని సృష్టించబోతున్నారు. హిస్టారికల్‌ నగరమైన కోల్‌కత్తాని హైదరాబాద్ కి తీసుకురాబోతున్నారు. 

`టాక్సీవాలా` వంటి డిఫరెంట్‌ సినిమాని రూపొందించిన రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కోల్‌కత్తా సెట్‌లోని హైదరాబాద్‌లో వేయబోతున్నారు. దాదాపు 6.5కోట్లతో భారీగా సెట్‌ వేయబోతుండటం విశేషం. దీన్నొక విజువల్‌ ఫీస్ట్ గా డిజైన్‌ చేయబోతున్నారట. `ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక  కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌`ని చిత్ర యూనిట్ తెలిపింది. 

`ద‌ర్శ‌కుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో తన గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో  అసోసియేట్‌ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ  సినిమా ఓ స్పెషల్‌ ఫిల్మ్‌గా ఉండబోతుంది. జీస్సూసేన్‌ గుప్తా, రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు` అని యూనిట్‌ చెప్పింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios