రెండేండ్ల తర్వాత ‘సర్కారు వారి పాట’తో అలరించేందుకు వస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ పై తాజాగా మేకర్స్ అనౌన్స్ మెంట్ చేశారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకుడు పరుశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. చివరిగా మహేశ్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆడియెన్స్ ను, తన అభిమానులను అలరించాడు. రెండేండ్ల తర్వాత మళ్లీ Sarkaru Vaari Paataతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. కోవిడ్ పరిస్థితుల కారణంగా కాస్తా షూటింగ్ ఆలస్యమైంది. ఎట్టకేళలకు మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది.
సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. దీంతో వరుస అప్డైట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 2న మాస్ ఎనర్జీతో కూడా సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ కు ఎంతగానో రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కోసం ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే మే 7న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
అయితే మహేశ్ బాబు ప్రస్తుతం స్మాల్ ట్రిప్ లో ఉన్నారు. సర్కారు వారి పాట రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన దుబాయ్ కి కుటుంబ సమేతంగా వెళ్లడం చర్ఛనీయాంశంగా మారింది. ట్రిప్ ఎప్పుడు ముగించుకుంటారో తెలియని కారణంగా.. సర్కారు వారి పాట ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకైనా వస్తాడా లేదా అని అభమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మే 3న మహేశ్ బాబు హైదరాబాద్ కు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
