`భోళాశంకర్` నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో.. ఓపెనింగ్ అదిరింది.. కానీ
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా `భోళాశంకర్` విడుదలకు మరో రెండు నెలలుంది. ప్రమోషనల్ కార్యక్రమాలు మాత్రం అప్పుడే స్టార్ట్ చేసింది యూనిట్. తాజాగా ఫస్ట్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు. ఆయన ఇప్పుడు `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య` సినిమాతో రచ్చ చేసిన చిరంజీవి ఇప్పుడు `భోళాశంకర్`తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. సినిమా నుంచి తొలి సాంగ్ `భోళా మానియా` ని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా పాట ప్రోమోని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్తోనే ఈ ప్రోమో ఉంది.
అయితే ఈ ప్రోమో ఇంట్రో అదిరింది.ఆ తర్వాత సౌండ్ క్లారిటీ లేదు. మెగాస్టార్ సినిమా పాటకి ఉండాల్సిన సౌండింగ్ లేదు. ఆ కిక్ మిస్ అయ్యింది. `వాల్తేరు వీరయ్య`లో పూనకాలు లోడింగ్ లాంటి పాటలు చూసిన ఫ్యాన్స్ కి ఈ సౌండింగ్ ఆనడం లేదని చెప్పాలి. ఆశించిన కిక్ ఈ ప్రోమోలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి పాటని ఈ నెల 4న రిలీజ్ చేయబోతున్నారు. ఫుల్ సాంగ్తో ఆ డిజప్పాయింట్మెంట్ని పుల్ఫిల్ చేస్తారేమో చూడాలి.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంది. `సైరా`లో కీలక పాత్రలో నటించిన తమన్నా ఇందులో పూర్తి స్థాయిలో ఆయనకు జోడీగా మెరవబోతుంది. మరోవైపు కీర్తిసురేష్ సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. చిరుకి ఆమె చెల్లిగా కనిపించబోతుంది. ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. దీంతో ఈ ఏడాది మరో హిట్కి రెడీ అవుతున్నారు చిరంజీవి.