యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్ రోడ్లపై ఓ సాధారణ వ్యక్తిలా చక్కర్లు కొట్టడం వార్తల్లో నిలిచింది. 

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్ రోడ్లపై ఓ సాధారణ వ్యక్తిలా చక్కర్లు కొట్టడం వార్తల్లో నిలిచింది. సాధారణ ప్రయాణికులతో కలిసి ఆటోలు, బస్సులు, మెట్రో రైలులో ప్రయాణిస్తూ షాక్ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సికింద్రాబాద్ బస్ స్టాప్ వద్ద ఓ బస్సు ఎక్కి కిటికీ వైపు కూర్చొని సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో మొదటిసారిగా బస్ ఎక్కానని ఆ అనుభవం మర్చిపోలేనని అన్నారు. అలానే బైక్ మీద ట్రిపుల్ రైడ్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు.

రూల్స్ బ్రేక్ చేస్తున్నానని తనకు తెలుసునని కానీ ఫోటో కోసం అలా చేయాల్సివచ్చిందని అన్నారు. మెట్రోలో కూడా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగరంలో తన జర్నీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ హీరో నటించిన 'రాక్షసుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో వచ్చిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…
Scroll to load tweet…