బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ప్రకటించాడు
‘అల్లుడు శీను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ను కొట్టలేకపోతున్నాడు. అన్ని సినిమాలను భారీ బడ్జెట్తో తెరకెక్కించినా, స్టార్ హీరోయిన్లతో జతకట్టినా అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.
‘అల్లుడు శీను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ను కొట్టలేకపోతున్నాడు. అన్ని సినిమాలను భారీ బడ్జెట్తో తెరకెక్కించినా, స్టార్ హీరోయిన్లతో జతకట్టినా అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా భాక్సాఫీస్ ని ఏలటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకొని మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
తాజాగా మరో చిత్రం ప్రకటించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ నటించనున్న చిత్రాన్ని ఈరోజు సాయి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో సాయి గడ్డం తో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. సత్యనారాయణ కోనేరు మరియు హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
శ్రీనివాస్ రీసెంట్ గా ‘కవచం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కు ఈ చిత్రం అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. అంతకు ముందు ‘సాక్ష్యం’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో.. డైరెక్టర్ తేజతో కలిసి సినిమాను చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది.